Leopard at Tirumala: తిరుమలలో మరో చిరుత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard at Tirumala: తిరుమలలో చిరుత సంచారం కొనసాగుతూనే ఉంది.. నడక మార్గంలో ఓ చిన్నారి చిరుత దాడిలో మృతిచెందిన తర్వాత.. పటిష్ట చర్యలకు దిగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతలు, ఇతర అడవి జంతువుల కదలికలను పసిగడుతోంది.. ఇక, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అయ్యింది.. ఇప్పటి వరకు నాలుగు చిరితులను అటవీశాఖ అధికారులు బంధించారు.. అయితే, ఇంతటితో చిరుతల సంచారం ఆగిపోయినట్టు అంతా సంతోషపడ్డారు.. కానీ, తాజాగా మరో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కిన్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
అలిపిరి నడకమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో మరో చిరుత సంచారం గుర్తించాం.. నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించింది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇక, నడకమార్గంలో భక్తులకు 5వ తేదీ నుంచి ఊతకర్రలను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని.. అలిపిరి దగ్గర భక్తులకు ఊతకర్రలను అందజేసి.. నరసింహస్వామి ఆలయం వద్ద వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం అన్నారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
మరోవైపు.. శ్రీవారి అభిషేకాని వినియోగించే పాలను టీటీడీ గోశాల నుంచి సేకరిస్తూన్నాం అని తెలిపారు ధర్మారెడ్డి.. స్వామివారి కైంకర్యాలకు ప్రతినిత్యం వినియోగించే 60 కేజీల నెయ్యిని కోనుగోలు చేస్తున్నట్ఉ వెల్లడించిన ఆయన.. త్వరలోనే గోశాల ద్వారా నెయ్యిని తయ్యారు చేస్తామన్నారు. ఆగస్టు నెలలో 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ద్వారా 120.05 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని.. ఇదే సమయంలో కోటి 9 లక్షల లడ్డూలను విక్రయించినట్టు తెలిపారు. 43.07 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా.. 9.07 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. అష్టవినాయక అతిధి గృహాని సామాన్య భక్తులుకు కేటాయించేలా వాటి ధరను 150 రూపాయలకు తగ్గిస్తూన్నాం.. వికాస్ నిలయంలో అతిధి గృహాన్ని 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరణ చేస్తున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
తాజావార్తలు
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!