AAM Admi Party: ఇండియా కూటమికి షాక్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAM Admi Party: ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం బీహార్లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను మరింత తగ్గించనుంది. ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ దేశ రాజధానిలో బీహార్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 2025లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బీహార్లో పార్టీని బలోపేతం చేయాలని సందీప్ పాఠక్ ఉద్ఘాటించారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే, బీహార్ ఇన్ఛార్జ్ అజేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
“మురికి రాజకీయాల కారణంగా రాష్ట్రం ముందుకు సాగకపోవటం బీహార్ దురదృష్టం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ బలంగా ఉండటం తప్పనిసరి.” అని ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ చెప్పారు. పార్టీని విస్తరించేందుకు ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయాలని బీహార్లోని పార్టీ నాయకులను పాఠక్ కోరారు. ‘‘బీహార్లో ఎన్నికల్లో పోటీ చేస్తాం. కానీ ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. బీహార్లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేం, అందుకు ముందుగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సొంతంగా కమిటీ వేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి ఇప్పటినుంచే కష్టపడండి. ఒకసారి పార్టీ బలంగా మారితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాము, ”అని సందీప్ పాఠక్ జోడించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: B20 Summit: భారతదేశంలో డిజిటల్ విప్లవం రాబోతోంది.. బీ20 సమ్మిట్లో ప్రధాని
ఎన్నికల్లో పోటీ చేయడానికి బలమైన పార్టీ అవసరమని ఉద్ఘాటించిన పాఠక్.. గుజరాత్లో మాదిరిగానే బీహార్లో కూడా ఆప్ పూర్తి శక్తితో ఎన్నికల్లో పోరాడుతుందని చెప్పారు. తన ప్రణాళికల గురించి పాఠక్ మాట్లాడుతూ, పార్టీ మొదట స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, గత తొమ్మిదేళ్లలో ప్రసంగాలు తప్ప ప్రధాని మోదీకి సమాధానాలు లేవని అన్నారు. ఇండియా కూటమి గురించి అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చని, దేశమే తమకు ముఖ్యమన్నారు. ఆప్ జాతీయ పార్టీ అని, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ఆయన.. పొత్తులపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆప్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ స్పందించారు. ఆప్ను బీహార్కు ఆహ్వానించిన వారికి ఈ చర్య ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. “బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు ఎన్డీయే గెలుస్తుంది. బీహార్లో AAP లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వారిని బీహార్కు ఆహ్వానించిన వారికి ఇది సమస్యాత్మకం.” అని షానవాజ్ హుస్సేన్ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!