B20 Summit: భారతదేశంలో డిజిటల్ విప్లవం రాబోతోంది.. బీ20 సమ్మిట్లో ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B20 Summit: ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన బిజినెస్ 20 సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్న చోట మాత్రమే లాభదాయకమైన మార్కెట్ మనుగడ సాగిస్తుందని ప్రధాని అన్నారు. ఇతర దేశాలను మార్కెట్గా పరిగణించడం ఎప్పటికీ పనికిరాదని అన్నారు. ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, ఇతర దేశాలను మాత్రమే మార్కెట్గా పరిగణించడం ఎప్పటికీ పనిచేయదని మోదీ అన్నారు. త్వరలో లేదా తరువాత అది ఉత్పత్తి దేశాలకు కూడా హాని చేస్తుందన్నారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం రాబోతోందని, మనతో స్నేహం మాత్రమే ప్రయోజనకరమని ప్రధాని అన్నారు. బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రగతిలో ప్రతి ఒక్కరినీ సమాన భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన పేదల సంక్షేమ విధానాల వల్ల రానున్న కొన్నేళ్లలో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఈ పరిణామం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
ఇక్కడ చాలా మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు ఉన్నారని, వ్యాపారాన్ని మరింత వినియోగదారు కేంద్రంగా ఎలా మార్చాలనే దానిపై మనమందరం మరింత ఆలోచించగలమన్నారు. . ఈ వినియోగదారులు వ్యక్తులు లేదా దేశాలు కావచ్చు, వారి ఆసక్తి ఏమిటో శ్రద్ధ వహించాలన్నారు. వినియోగదారుల సంరక్షణకు పెద్ద పీట వేయాలన్న మోదీ.. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. అతిపెద్ద మహమ్మారి కరోనా ప్రపంచానికి పెద్ద పాఠం నేర్పిందని ప్రధాని అన్నారు. ఈ మహమ్మారి ప్రతి దేశానికి, సమాజానికి, వ్యాపార రంగానికి, కార్పొరేట్ సంస్థలకు ఒక పాఠాన్ని నేర్పిందన్నారు. మనం పరస్పర విశ్వాసంతో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలన్నారు. కరోనా పరస్పర విశ్వాసాన్ని దారుణంగా నాశనం చేసిందని, ఈ వాతావరణంలో కూడా విశ్వాసంతో నిలిచిన ఏకైక దేశం భారత్ అని ప్రధాని అన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Chandrayaan-3: తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రత వివరాలు పంపిన విక్రమ్
క్రిప్టోకరెన్సీల సమస్యపై మోదీ మాట్లాడుతూ, దేశాల్లో మరింత ఏకీకృత విధానం అవసరమని అన్నారు. దీని కోసం ఒక గ్లోబల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని, అందులో అన్ని వాటాదారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈ సారి భారతదేశంలో పండుగల సీజన్ ఆగస్టు 23 నుండి ప్రారంభమైందని ప్రధాని చెప్పారు. ఎందుకంటే, ఆగస్టు 23న చంద్రుడిని చేరుకునే పని చేశాం. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత జరుపుకునే వేడుక పండుగ కంటే తక్కువ కాదని ప్రధాని అన్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల మధ్య వ్యాపార సంబంధిత విషయాలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికే బిజినెస్ 20 లేదా బీ20 ఫోరమ్. గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. 2010లో దీనిని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ బీ20 ఫోరమ్ జీ20 సదస్సుకు 54 సిఫారసులు చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!