Minister KTR: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి..
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ. 350 కోట్లు పెట్టుబడిని పెట్టనుంది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం దాదాపు రూ. 350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్, ఇతర పరికరాలను తయారు చేయనున్నారు.
Read Also: Cauvery row: కర్ణాటకలో కావేరి చిచ్చు.. బెంగళూర్ బంద్కు పిలుపు
Also Read
- Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
- Vijay TVK Government: టీవీకే విజయ్కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
- Kolkata: కోల్కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
ఈ కంపెనీ తయారీ ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 28న చేయనున్నారు. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా, మంత్రి కేటీఆర్ హజరుకానున్నారు. ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి సక్సెస్ ఫుల్ గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణలో మరింతగా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా దాదాపు 350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నందుకు కంపెనీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Flipkart: ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్స్.. ఆ వస్తువులపై అదిరిపోయే ఆఫర్స్..
తెలంగాణలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల కల్పనే.. అనేక నూతన పెట్టుబడులను రాష్ట్రానికి తరలి వచ్చేలా చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కార్యకలాపాలను, తమ పెట్టుబడులను విస్తరించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తెలుసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
Happy to share that the popular Sintex brand is setting up a plant in Telangana
The Sintex unit will manufacture tanks, pipes, auto components and ancillaries with an investment of ₹350 Crores and generating employment to 1000 people
Will be breaking ground for the same on… pic.twitter.com/UrzAJX1ezi
— KTR (@KTRBRS) September 23, 2023
తాజావార్తలు
-
West Bengal New Assembly: పశ్చిమ బెంగాల్ కొత్త శాసనసభ ఏర్పాటుకు మార్గం సుగమం.. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ
-
Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
-
NTRNEEL : ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమా డైలాగ్ రైటర్ గా దేవాకట్టా
-
Vivek Agnihotri: మమతా బెనర్జీ ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి సంచలన పోస్ట్..
-
IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!