China: చైనా మాయలో చిక్కుకున్న మరోదేశం..భారత్ కు పొంచి ఉన్న ముప్పు !
- ఎప్పుడూ పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి యత్నిస్తున్న చైనా
- సహాయం పేరుతో అప్పు ఇచ్చి ట్రాప్
- శ్రీలంక.. నేపాల్ తర్వాత డ్రాగన్ కు బలైన తజికిస్థాన్
- బీఆర్ఐ పేరుతో తజికిస్థాన్కు బిలియన్ డాలర్ల రుణాలు
- తిరిగి ఇవ్వమని పదే పదే ఒత్తిడి
చైనా ఎప్పుడూ తన పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొదట సహాయం పేరుతో అప్పు ఇచ్చి, ఆ తర్వాత తన బలగాలను వారి ప్రాంతంలో మోహరించడం ప్రారంభిస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ తర్వాత ఇప్పుడు చైనా.. తజికిస్థాన్ను బలిపశువుగా మార్చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) పేరుతో చైనా తజికిస్థాన్కు భారీ రుణం ఇచ్చింది. భద్రతా ఒప్పందంపై సంతకం అనంతరం డ్రాగన్ తజికిస్తాన్లో రహస్య స్థావరాన్ని నిర్మిస్తుందనే వాదనలు వినిపించాయి. ఇది భారతదేశానికి పెద్ద ముప్పు ఎందుకంటే ఈ రహస్య స్థావరం పీవోకే(POK) కి చాలా దగ్గరగా ఉంది.
READ MORE: Automobile Sector Budget 2024: ఆటో పరిశ్రమకు బడ్జెట్ ఎలా ఉంది.. EVలు చౌకగా మారే అవకాశం ఉందా..?
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ బీఆర్ఐ పేరుతో తజికిస్థాన్కు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వమని పదే పదే ఒత్తిడి తెస్తుంది. ప్రస్తుతం.. తజికిస్థాన్ డబ్బును తిరిగి చెల్లించలేకపోతుంది. దీంతో చైనా తజికిస్థాన్లోని తూర్పు గోర్నో బదక్షన్ ప్రాంతంలో సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని 2019లో వెల్లడైంది. అయితే.. చైనా లేదా తజికిస్థాన్ దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. చైనా ఇక్కడ పూర్తి రహస్య స్థావరాన్ని నిర్మించుకున్నట్లు ఇటీవల కొన్ని ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. అయితే ఆ నివేదికను చైనా తోసిపుచ్చింది.
READ MORE: Om birla: లోక్సభ స్పీకర్ కుమార్తె జాబ్పై విమర్శలు.. హైకోర్టులో పరువు నష్టం దావా
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2023 అక్టోబర్లో పొరుగు దేశాలను హెచ్చరించారు. చైనా హిడెన్ ఎజెండా గురించి చెబుతూ.. ప్రమాదానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు డ్రాగన్ వలలో ఎలా చిక్కుకుపోయాయో చెప్పారు. మాల్దీవులు కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పుడు తజికిస్తాన్ బలిపశువుగా మారుతోంది. అక్టోబరు 2021లో, తజికిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బదక్షన్ ప్రాంతంలో మరో చైనా స్థావరాన్ని నిర్మించేందుకు అక్కడి పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు కొత్త రహస్య స్థావరం వెలుగులోకి వచ్చింది. తజకిస్థాన్ను మోసం చేసి చైనా ఈ భూమిని లాక్కుందని అంటున్నారు.
తాజావార్తలు
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!