China: చైనా మాయలో చిక్కుకున్న మరోదేశం..భారత్ కు పొంచి ఉన్న ముప్పు !
- ఎప్పుడూ పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి యత్నిస్తున్న చైనా
- సహాయం పేరుతో అప్పు ఇచ్చి ట్రాప్
- శ్రీలంక.. నేపాల్ తర్వాత డ్రాగన్ కు బలైన తజికిస్థాన్
- బీఆర్ఐ పేరుతో తజికిస్థాన్కు బిలియన్ డాలర్ల రుణాలు
- తిరిగి ఇవ్వమని పదే పదే ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా ఎప్పుడూ తన పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొదట సహాయం పేరుతో అప్పు ఇచ్చి, ఆ తర్వాత తన బలగాలను వారి ప్రాంతంలో మోహరించడం ప్రారంభిస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ తర్వాత ఇప్పుడు చైనా.. తజికిస్థాన్ను బలిపశువుగా మార్చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) పేరుతో చైనా తజికిస్థాన్కు భారీ రుణం ఇచ్చింది. భద్రతా ఒప్పందంపై సంతకం అనంతరం డ్రాగన్ తజికిస్తాన్లో రహస్య స్థావరాన్ని నిర్మిస్తుందనే వాదనలు వినిపించాయి. ఇది భారతదేశానికి పెద్ద ముప్పు ఎందుకంటే ఈ రహస్య స్థావరం పీవోకే(POK) కి చాలా దగ్గరగా ఉంది.
READ MORE: Automobile Sector Budget 2024: ఆటో పరిశ్రమకు బడ్జెట్ ఎలా ఉంది.. EVలు చౌకగా మారే అవకాశం ఉందా..?
Also Read
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ బీఆర్ఐ పేరుతో తజికిస్థాన్కు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వమని పదే పదే ఒత్తిడి తెస్తుంది. ప్రస్తుతం.. తజికిస్థాన్ డబ్బును తిరిగి చెల్లించలేకపోతుంది. దీంతో చైనా తజికిస్థాన్లోని తూర్పు గోర్నో బదక్షన్ ప్రాంతంలో సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని 2019లో వెల్లడైంది. అయితే.. చైనా లేదా తజికిస్థాన్ దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. చైనా ఇక్కడ పూర్తి రహస్య స్థావరాన్ని నిర్మించుకున్నట్లు ఇటీవల కొన్ని ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. అయితే ఆ నివేదికను చైనా తోసిపుచ్చింది.
READ MORE: Om birla: లోక్సభ స్పీకర్ కుమార్తె జాబ్పై విమర్శలు.. హైకోర్టులో పరువు నష్టం దావా
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2023 అక్టోబర్లో పొరుగు దేశాలను హెచ్చరించారు. చైనా హిడెన్ ఎజెండా గురించి చెబుతూ.. ప్రమాదానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు డ్రాగన్ వలలో ఎలా చిక్కుకుపోయాయో చెప్పారు. మాల్దీవులు కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పుడు తజికిస్తాన్ బలిపశువుగా మారుతోంది. అక్టోబరు 2021లో, తజికిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బదక్షన్ ప్రాంతంలో మరో చైనా స్థావరాన్ని నిర్మించేందుకు అక్కడి పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు కొత్త రహస్య స్థావరం వెలుగులోకి వచ్చింది. తజకిస్థాన్ను మోసం చేసి చైనా ఈ భూమిని లాక్కుందని అంటున్నారు.
తాజావార్తలు
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!