Simhadri Appanna Chandanotsavam : వైభవంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhadri Appanna Chandanotsavam : సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత ఏడాది వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. రెండు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా. ఆఖరి భక్తుడి వరకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దర్శనం చేయించే బాధ్యతను సమిష్టిగా తీసుకున్నామంటున్నారు కలెక్టర్ మల్లిఖార్జున. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం రద్దీ నెలకొననున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సింహాచలం చందనోత్సవం కోసం రెండు వేల మంది పోలీసులుతో భద్రత ఏర్పాట్లు జరిగాయి. సింహగిరి మొత్తం సీసీ కెమెరా నిఘా, పర్యవేక్షణలో వుంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. ఏడాదికి ఒకసారి జరిగే సింహాద్రి నాథుడు నిజరూప దర్శనం గురించి అందరికి తెలిసిందే.
Read Also: CM YS Jagan: నేటి సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
సింహాచల క్షేత్రంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి విజయ ప్రదాతకు వైశాఖ శుద్ధ తదియనాడు చందనసేవ జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింప చేసే దేవుడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చందనోత్సవం సందర్భంగా తెల్లవారు జామునుంచే దర్శనాలు మొదలయ్యాయి. మూడు గంటల నుంచి వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకొని తొలిపూజలో పాల్గొన్నారు. అప్పన్న నిజరూపాన్ని తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఏడాదికోసారి జరిగే సింహాద్రి అప్పన్న చందనోత్సవం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. స్వామివారి నిజ స్వరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!