Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!
- ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉగాది కానుక
- నేడే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు
- నేటితో రూ.20,000 ఆర్థిక సాయం పూర్తి
Annadata Sukhibhava 3rd Installment Today in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. 2026 ఉగాది కానుకగా ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ 3.0’ పథకాల కింద ప్రభుత్వం మూడో విడత ఆర్థిక సాయంను నేడు విడుదల చేయనుంది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.2,676 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,874 కోట్లు ఉండటం విశేషం.
ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3.0 పథకాల కింద రైతులకు రెండు విడతలుగా రూ.14,000 అందించారు. ఈరోజు జమ చేయనున్న రూ.6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి ఇచ్చే రూ.20,000 ఆర్థిక సాయం పూర్తవుతుంది. రైతుల ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత మద్దతు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో నిర్వహించే కార్యక్రమం నుంచి సీఎం రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేయనున్నారు.
Also Read
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
Also Read: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!
ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు సాయంత్రం 4.20 గంటలకు సూరంపల్లికి చేరుకోనున్నారు. అనంతరం 4.25 నుంచి 4.55 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!