Anmol Bishnoi: అమెరికాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అరెస్ట్..
- గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్ట్
- అన్మోల్ను కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు.
Read Also: Nirmala Sitharaman: ఎస్బీఐ మరింత విస్తరణ.. త్వరలో 500 బ్రాంచ్లు ప్రారంభం
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
బాబా సిద్ధిఖీ హత్య కేసుతో సహా కొన్ని హై ప్రొఫైల్ నేరాల్లో అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్ బిష్ణోయ్పై సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.10 లక్షల రివార్డును ఇటీవల ప్రకటించింది. 2022లో నమోదైన రెండు కేసుల్లో ఎన్ఐఏ అన్మోల్పై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అంతేకాకుండా.. ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అన్మోల్ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో అన్మోల్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది.
అలాగే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఎన్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్ నిందితులుగా ఉన్నారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత పూణేకు చెందిన ఓ పెద్ద నాయకుడు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ రాడార్లో ఉన్నాడు. ఇటీవల, తీహార్ జైలు పరిపాలన.. బాబా సిద్ధిఖీ హత్య కేసును విచారించిన తరువాత బిష్ణోయ్ గ్యాంగ్ శ్రద్ధా వాకర్ హత్య కేసు దోషి అఫ్తాబ్ పూనావాలాను లక్ష్యంగా చేసుకోవడానికి ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నిందితుడు అఫ్తాబ్ చుట్టూ భద్రతను పెంచారు. పరారీలో ఉన్న నేరస్థుడు అన్మోల్ బిష్ణోయ్ను అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ.. గత నెల ప్రారంభంలో ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కూడా MCOCA కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!