Andhrapradesh IT Exports: ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో వివరించారు కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఏపీ వాటా 0.2% లోపే వుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో అత్యాధునిక ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనమవుతోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2021-22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు మాత్రమేనని రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది కేవలం 0.14% మాత్రమే. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా ఎప్పుడూ 0.2% కంటే తక్కువగానే ఉందన్నారు.
Read Also: Tirupati IIT: జూన్ నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్ సిద్ధం
Also Read
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రధాన ఐటి హబ్గా ఎదగడానికి గల అవకాశాల గురించి అడిగినప్పుడు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు, భారీ ఉత్పాదక స్థావరాలు (base), I/TITES పరిశ్రమ అభివృద్ధికి ప్రతిభావంతులైన యువత మరియు వ్యాపార అనుకూల వాతావరణం ఉన్నాయని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇతర ఇంక్యుబేషన్ సెంటర్ల గురించి అడిగినప్పుడు, ICT స్టార్టప్లకు మద్దతుగా “టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ (TIDE) 2.0” అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఐదు ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వీటిలో విశాఖపట్నంలో రెండు, తిరుపతి, గుంటూరు, చిత్తూరులో ఒక్కొక్కటి పనిచేస్తున్నాయని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే, STPIకి కాకినాడ, విజయవాడ మరియు తిరుపతిలలో మూడు ఇంక్యుబేషన్ సెంటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మరియు విజయవాడలలో నాలుగు STPI కేంద్రాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టిపిఐ) పూర్తి స్థాయి ఇంక్యుబేషన్ సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంలో జాప్యానికి గల కారణాలను అడిగినప్పుడు, ఎస్టిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఎపిఐఎస్) సంయుక్త తనిఖీ నిర్వహించాయని, అయితే సరైన స్థలం చూపించలేదని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎస్టిపిఐ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎస్టిపిఐకి ఒక ఎకరం భూమిని అందించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ జనవరి 2023లో అంగీకారం తెలిపిందని ఆయన తెలిపారు.
ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ, దేశంలో ఐటీ మ్యాన్పవర్లో ఆంధ్రప్రదేశ్ వాటా 10% ఉందని, అయితే ఐటీ ఎగుమతుల్లో కేవలం 0.2% కంటే తక్కువ వాటా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా కృషి చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
Read Also: Punjab Kings: పంజాబ్ జట్టులో కీలక మార్పు.. ఆల్రౌండర్ స్థానంలో అతడు
తాజావార్తలు
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?