వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra University: విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ తన వందేళ్ల వైభవాన్ని ఘనంగా చాటుకుంటూ మరో అరుదైన గుర్తింపును సాధించింది. శతాబ్ది వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 100 నాణెం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేయడం విశేషం. ఇది యూనివర్సిటీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడాతో కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభించనున్నాయి.
ఇక “మిషన్ మౌసమ్” ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 180 కోట్ల నిధులతో ట్రాపికల్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ కేంద్రం వాతావరణ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రా యూనివర్సిటీ ప్రపంచ టాప్ 100 యూనివర్సిటీల్లో స్థానం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న స్కిల్ గ్యాప్ను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీని అనుసంధానిస్తామని పేర్కొన్నారు.
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
- Siddaramaiah: "హిజాబ్"కు అనుమతి, "కాషాయ కండువాల"కు నో పర్మిషన్..
యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఏడాదిలోగా భర్తీ చేస్తామని, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన పాఠ్యాంశాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. రీసెర్చ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ. 250 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి చదివిన అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేసిన లోకేష్, విద్యార్థులు ప్రతి ఓటమిని విజయానికి తొలి మెట్టగా భావించాలని సూచించారు. తన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చూపిస్తూ, మంగళగిరిలో ఓటమి తనలో మరింత కసిని పెంచి తద్వారా భారీ మెజారిటీతో గెలవడానికి దోహదపడిందని చెప్పారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!