NTV Telugu Site icon

Schools Reopen: ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Schools Reopen

Schools Reopen

Schools Reopen: వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ గతంలో చెప్పారు. ఈ క్రమంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, విద్యా కానుకను పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Read Also: Telangana Union Cabinet: నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్

రాష్ట్రంలో మొత్తం 62,023 స్కూల్స్ ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమా­న్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలు నేడు ప్రారంభమవుతాయి. ఇక కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి.