Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం.. పేదలకు ఇళ్ల పేరుతో 3 వేల కోట్ల దోపిడీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. సొంతంగా ఇళ్లు కట్టుకోలేని గిరిజన బిడ్డలతో పాటు నిరుపేదలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.2.30 లక్షల చొప్పున మంజూరు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని జగన్ రెడ్డి రూ.1.80 లక్షలకు తగ్గించారని.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగనన్నకాలనీల పేరుతో దుర్మార్గాలకు పాల్పడ్డారన్నారు. భూసేకరణ, లేఅవుట్ల అభివృద్ధితో పాటు ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. బేస్మెంట్లు లేవు, నాణ్యత లేదు.. స్టీలు కనిపించదు.. ఒక ఇంటికి వాడాల్సిన సిమెంటును మూడు, నాలుగు ఇళ్లకు వినియోగించారని చెప్పారు.
READ MORE: US-Colombia Diplomatic Tension: ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
ఎలాంటి ఫౌండేషన్ లేకుండా నేలపైనే తూతూమంత్రగా బేస్మెంట్లు కట్టారని.. సిట్ తో సమగ్ర విచారణ జరిపించి అక్రమాలను నిగ్గు తేల్చాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. “నా నియోజకవర్గంలో అత్యంత నాసిరకంగా జరిగిన నిర్మాణాలను సాక్షాత్తు హౌసింగ్ మంత్రి పార్థసారథి స్వయంగా చూశారు. ఆప్షన్ -3లో చేపట్టిన ఇళ్లలో పేద కుటుంబాలు బిడ్డాపాపలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన భయానక పరిస్థితి. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి, వారి మెడలు వంచి రికవరీ చేయాలి…తిరిగి వారి చేతే పేద కుటుంబాలకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి మన సీఎం చంద్రబాబు నాయుడు అదనంగా రూ.75 వేలు వరకు మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ కు రూ.1.80 లక్షల నుంచి రూ.2.55 లక్షలకు పెంచారు. ఆప్షన్ -3లోని నిరుపేదల ఇళ్లను దోపిడీ వనరుగా మార్చుకున్నారు…బేస్మెంట్ లెవల్ లోనే భారీగా దోపిడీకి పాల్పడ్డారు. రూ.53 వేలుగా ఉన్న బేస్మెంట్ లెవల్ బిల్లును రోజుల వ్యవధిలో రూ.70 వేలకు పెంచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి గతంలో ఈ దోపిడీ అంశాన్ని తీసుకెళ్లగానే నెల్లూరు జిల్లాకు సంబంధించి విజిలెన్స్ తో విచారణ చేయించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే రూ.100 కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. నాణ్యత విషయంలో కూడా విచారణ చేస్తే మరో రూ.100 కోట్ల అక్రమాలు బయటపడుతాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఒక్క నెల్లూరు జిల్లాలో రూ.200 కోట్లు దుర్వినియోగమైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో జరిగివుంటుందో అర్థం చేసుకోవచ్చు.” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ -3 హౌసింగ్ స్కామ్ పై సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ముక్కు పిండి దోపిడీ చేసిన సొత్తును కక్కించడంతో పాటు గొంతు కత్తి పెట్టి అయినా నిరుపేదలకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాలని కోరారు.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!