Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Option 3 Housing Scam Allegations

Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం.. పేదలకు ఇళ్ల పేరుతో 3 వేల కోట్ల దోపిడీ.!

Published Date :September 27, 2025 , 6:46 pm
By RAMAKRISHNA KENCHE
Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం.. పేదలకు ఇళ్ల పేరుతో 3 వేల కోట్ల దోపిడీ.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Somireddy Chandra Mohan Reddy: హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. సొంతంగా ఇళ్లు కట్టుకోలేని గిరిజన బిడ్డలతో పాటు నిరుపేదలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.2.30 లక్షల చొప్పున మంజూరు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని జగన్ రెడ్డి రూ.1.80 లక్షలకు తగ్గించారని.. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగనన్నకాలనీల పేరుతో దుర్మార్గాలకు పాల్పడ్డారన్నారు. భూసేకరణ, లేఅవుట్ల అభివృద్ధితో పాటు ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. బేస్మెంట్లు లేవు, నాణ్యత లేదు.. స్టీలు కనిపించదు.. ఒక ఇంటికి వాడాల్సిన సిమెంటును మూడు, నాలుగు ఇళ్లకు వినియోగించారని చెప్పారు.

READ MORE: US-Colombia Diplomatic Tension: ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

ఎలాంటి ఫౌండేషన్ లేకుండా నేలపైనే తూతూమంత్రగా బేస్మెంట్లు కట్టారని.. సిట్ తో సమగ్ర విచారణ జరిపించి అక్రమాలను నిగ్గు తేల్చాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. “నా నియోజకవర్గంలో అత్యంత నాసిరకంగా జరిగిన నిర్మాణాలను సాక్షాత్తు హౌసింగ్ మంత్రి పార్థసారథి స్వయంగా చూశారు. ఆప్షన్ -3లో చేపట్టిన ఇళ్లలో పేద కుటుంబాలు బిడ్డాపాపలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన భయానక పరిస్థితి. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి, వారి మెడలు వంచి రికవరీ చేయాలి…తిరిగి వారి చేతే పేద కుటుంబాలకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి మన సీఎం చంద్రబాబు నాయుడు అదనంగా రూ.75 వేలు వరకు మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ కు రూ.1.80 లక్షల నుంచి రూ.2.55 లక్షలకు పెంచారు. ఆప్షన్ -3లోని నిరుపేదల ఇళ్లను దోపిడీ వనరుగా మార్చుకున్నారు…బేస్మెంట్ లెవల్ లోనే భారీగా దోపిడీకి పాల్పడ్డారు. రూ.53 వేలుగా ఉన్న బేస్మెంట్ లెవల్ బిల్లును రోజుల వ్యవధిలో రూ.70 వేలకు పెంచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి గతంలో ఈ దోపిడీ అంశాన్ని తీసుకెళ్లగానే నెల్లూరు జిల్లాకు సంబంధించి విజిలెన్స్ తో విచారణ చేయించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే రూ.100 కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. నాణ్యత విషయంలో కూడా విచారణ చేస్తే మరో రూ.100 కోట్ల అక్రమాలు బయటపడుతాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఒక్క నెల్లూరు జిల్లాలో రూ.200 కోట్లు దుర్వినియోగమైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో జరిగివుంటుందో అర్థం చేసుకోవచ్చు.” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ -3 హౌసింగ్ స్కామ్ పై సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ముక్కు పిండి దోపిడీ చేసిన సొత్తును కక్కించడంతో పాటు గొంతు కత్తి పెట్టి అయినా నిరుపేదలకు నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాలని కోరారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Assembly news
  • Andhra Pradesh News
  • AP housing scam
  • Chandrababu Naidu
  • housing department fraud

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions