Andhra Pradesh: అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ కూడా కేవలం ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేశారు.. దీనిపై ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసినట్టు వెల్లడించారు.. రికార్డు సమయంలో రైతులకు జగన్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. కేవలం 5 రోజులకే ధాన్యం డబ్బులు జమ చేసింది సర్కార్.. ఈ రోజు ఒక్కరోజే 32,558 రైతుల ఖాతాల్లో 474 కోట్ల రూపాయలు జమ చే శారు..
Read Also: Pawan Kalyan: కొంచెం ఊపిరి పీల్చుకొనే టైమ్ అన్నా ఇవ్వండన్నా.. చంపేస్తారా
ఇక, రబీలో ఇప్పటి వరకు రూ.1,277 కోట్ల ధాన్యం డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తంగా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ చేశారు.. 21 రోజులు సమయమున్న 5 రోజులకే రైతులకు చెల్లింపులు చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. అందులో పశ్చిమగోదావరి జిల్లా రైతులకు 527 కోట్ల రూపాలయు.. ఏలూరు జిల్లా రైతులకు 296 కోట్ల రూపాయలు.. తూర్పుగోదావరి జిల్లా రైతులకు 258 కోట్ల రూపాయలు.. కోనసీమ జిల్లా రైతులకు 100 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.