Ancient Ayyappa Idol: ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చిన అయ్యప్ప విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రం ఎంతో సంపదను మనకు అందిస్తుంది. ఉప్పాడ తీర వాసులకు అయ్యప్ప స్వామి విగ్రహ దర్శనం లభించింది. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది పురాతన అయ్యప్ప విగ్రహం. కెరటాలతో పాటు వచ్చినట్లు గుర్తించి బయటకు తీశారు స్థానిక యువకులు. స్థానిక జగన్నాథస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు అయ్యప్ప భక్తులు, మహిళలు. వివిధ కారణాల వల్ల సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆలయాల నుంచి ఈ విగ్రహం కొట్టుకుని వచ్చినట్లు భావిస్తున్నారు స్థానిక యువకులు.

Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
అయ్యప్ప దీక్షల సమయం కావడంతో ఈ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. చేపల కోసం వల వేస్తే అయ్యప్ప విగ్రహం వలకు తగిలింది. బరువుగా ఉండడంతో గట్టిగా లాగి ఆ విగ్రహాన్ని బయటకు తీశామని స్థానికులు తెలిపారు. ముగ్గురు మోసుకుని వచ్చి జగన్నాథ స్వామి గుడిలో పెట్టి పూజలు చేస్తున్నామన్నారు. దీనికి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం లభించడం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని, శుభసూచకం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విగ్రహం ఇతర దేశాలకు చెందినదా, లేక మన దేశంలోని ఆలయానికి చెందినదా అనేది ఇంకా తేల్చాల్చి వుంది.

Read Also: Superstar Krishna: ఆయనే మన జేమ్స్బాండ్.. కృష్ణ మృతిపై తెలుగు సీఎంల సంతాపం
గతంలో సముద్ర తీరంలోకి ఒక ఆలయం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అసాని తుపాను వచ్చినప్పుడు ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావించారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు పేర్కొన్నారు.
ఆ రథం మయన్మార్ దేశానిదని తర్వాత ప్రకటించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రథంపై ఉన్న భాషను గూగుల్లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదన్నారు పోలీసులు. మరి ఇప్పుడు కొట్టుకుని వచ్చిన అయ్యప్ప విగ్రహం ఎక్కడిది అనేది త్వరలో తేలనుంది.

శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన గోల్డెన్ టెంపుల్ ఇదే
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!