Ancient Ayyappa Idol: ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చిన అయ్యప్ప విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రం ఎంతో సంపదను మనకు అందిస్తుంది. ఉప్పాడ తీర వాసులకు అయ్యప్ప స్వామి విగ్రహ దర్శనం లభించింది. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది పురాతన అయ్యప్ప విగ్రహం. కెరటాలతో పాటు వచ్చినట్లు గుర్తించి బయటకు తీశారు స్థానిక యువకులు. స్థానిక జగన్నాథస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు అయ్యప్ప భక్తులు, మహిళలు. వివిధ కారణాల వల్ల సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆలయాల నుంచి ఈ విగ్రహం కొట్టుకుని వచ్చినట్లు భావిస్తున్నారు స్థానిక యువకులు.

Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అయ్యప్ప దీక్షల సమయం కావడంతో ఈ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. చేపల కోసం వల వేస్తే అయ్యప్ప విగ్రహం వలకు తగిలింది. బరువుగా ఉండడంతో గట్టిగా లాగి ఆ విగ్రహాన్ని బయటకు తీశామని స్థానికులు తెలిపారు. ముగ్గురు మోసుకుని వచ్చి జగన్నాథ స్వామి గుడిలో పెట్టి పూజలు చేస్తున్నామన్నారు. దీనికి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం లభించడం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని, శుభసూచకం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విగ్రహం ఇతర దేశాలకు చెందినదా, లేక మన దేశంలోని ఆలయానికి చెందినదా అనేది ఇంకా తేల్చాల్చి వుంది.

Read Also: Superstar Krishna: ఆయనే మన జేమ్స్బాండ్.. కృష్ణ మృతిపై తెలుగు సీఎంల సంతాపం
గతంలో సముద్ర తీరంలోకి ఒక ఆలయం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అసాని తుపాను వచ్చినప్పుడు ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావించారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు పేర్కొన్నారు.
ఆ రథం మయన్మార్ దేశానిదని తర్వాత ప్రకటించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రథంపై ఉన్న భాషను గూగుల్లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదన్నారు పోలీసులు. మరి ఇప్పుడు కొట్టుకుని వచ్చిన అయ్యప్ప విగ్రహం ఎక్కడిది అనేది త్వరలో తేలనుంది.

శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన గోల్డెన్ టెంపుల్ ఇదే
తాజావార్తలు
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?