Superstar Krishna: ఆయనే మన జేమ్స్బాండ్.. కృష్ణ మృతిపై తెలుగు సీఎంల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu States CM YS Jagan Mohan Reddy KCR Pay Tributes To Krishna Demise: సూపర్స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కన్నుమూశారు. ఈయన మృతితో ఘట్టమనేని కుటుంబంతో పాటు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు.
‘‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం.. తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ మాధ్యమంగా సంతాపం తెలియజేశారు. వైఎస్ కుటుంబానికి ఘట్టమనేని కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే! రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణ.. ఆయన మరణించిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక.. కృష్ణ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని కృష్ణ సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచే వైఎస్ కుటుంబంతో కృష్టకి గట్టి బాండింగ్ ఏర్పడింది.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా.. ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. అటు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి ఆర్కే రోజా, గవర్నర్ తమిళిసై కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!