Hyderabad CP: హైదరాబాద్ లో అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్జల్ గంజ్ పోలీసులు టీఎస్ న్యాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశామని హైదరాబద్ సీపీ సందీప్ సాండిల్య తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 1464 నైట్రావెట్ మాత్రలు (సైకోట్రోపిక్ డ్రగ్), రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేశాం.. ప్రధాన నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ పై బీదర్లో రౌడీ షీట్ ఉంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ్ తో పాటు కుటుంబం గత 14 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ నైట్రావెట్ మాత్రలు విక్రయిస్తుంది.. మరో నిందితుడు కిషన్ విట్టల్ రావు కాంబ్లే బిర్జు ఉపాధ్యాయ్ కు అసోసియేట్ గా వ్యవహరిస్తాడు అని సీపీ తెలిపారు.
Read Also: Minister KTR: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
గుల్బర్గాకు చెందిన సుప్రీత్ నవలే అనే వ్యక్తి నుండి బిర్జు ఉపాధ్యాయ్ మాత్రలు కొనుగోలు చేస్తాడు అని సీపీ సాండిల్య పేర్కొన్నారు. ఒక్కో నైట్రావెట్ మాత్రల బాక్స్ ను రెండు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్లోని డ్రగ్ పెడ్లర్లకు రూ. 5,500 అక్రమంగా విక్రయించారు.. బిర్జు ఉపాధ్యాయ్ తన భార్య కుమారుడు అత్త సహకారంతో కర్ణాటక నుండి హైదరాబాద్ కి డ్రగ్ సరఫరా చేసేవాడు అని ఆయన చెప్పుకొచ్చారు. బిర్జు తన బంధువు రాను భాయి అనే వ్యక్తికి టాబ్లెట్స్ ఇచ్చి కర్ణాటక నుండి హైదరాబాద్ పంపాడు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సాండిల్య చెప్పారు.
Read Also: Rohit Sharma: నెదర్లాండ్స్తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
ఈ టాబ్లెట్స్ ను మాంగర్ బస్తీలో నివాసం ఉంటున్న రాజు, పల్లవి అనే తన బంధువులకు సరఫరా చేయాల్సి ఉంది.. ఈ క్రమంలో నిందితుడు రాను భాయి కర్ణాటక నుండి నైట్రావెట్ ట్యాబ్లెట్లను తీసుకుని Mgbs లో బస్సు దిగాడు అని సందీప్ సాండిల్య తెలిపారు. నైట్రావెట్ మాత్రలను మాంగేర్ బస్తీలోని హబీబ్నగర్ ను తీసుకు వెళ్తూ ఉండగా టీఎస్న్యాబ్, అఫ్జల్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆపై మంగర్బస్తీలోని నిందితుల ఇంటిపై దాడి చేసారు.. నిందితుల నివాసంలో 11 బాక్స్ల నైట్రావెట్ టాబ్లెట్లు 22 ఎస్కుఫ్ సిరప్ లను సీజ్ చేసాం.. బంగారు బస్తిలోని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు బీదర్ లోని బిరుసు ఫ్యామిలీ పట్టుకునేందుకు హెచ్న్యూకి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది వెళ్ళారు.. నిందితులు ఇంటిపై ఈ నెల నాలుగో తేదీన తెల్లవారుజామున 1 గంటలకు రైడ్ చేశారు.. ఉమ్మడి కుటుంబం కావడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కలిసి మా పోలీసులపై దాడి చేశారు అని హైదరాబాద్ సీపీ సందీప్ సాండిల్య వెల్లడించారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!