Hyderabad CP: హైదరాబాద్ లో అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్జల్ గంజ్ పోలీసులు టీఎస్ న్యాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశామని హైదరాబద్ సీపీ సందీప్ సాండిల్య తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 1464 నైట్రావెట్ మాత్రలు (సైకోట్రోపిక్ డ్రగ్), రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేశాం.. ప్రధాన నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ పై బీదర్లో రౌడీ షీట్ ఉంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ్ తో పాటు కుటుంబం గత 14 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ నైట్రావెట్ మాత్రలు విక్రయిస్తుంది.. మరో నిందితుడు కిషన్ విట్టల్ రావు కాంబ్లే బిర్జు ఉపాధ్యాయ్ కు అసోసియేట్ గా వ్యవహరిస్తాడు అని సీపీ తెలిపారు.
Read Also: Minister KTR: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
గుల్బర్గాకు చెందిన సుప్రీత్ నవలే అనే వ్యక్తి నుండి బిర్జు ఉపాధ్యాయ్ మాత్రలు కొనుగోలు చేస్తాడు అని సీపీ సాండిల్య పేర్కొన్నారు. ఒక్కో నైట్రావెట్ మాత్రల బాక్స్ ను రెండు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్లోని డ్రగ్ పెడ్లర్లకు రూ. 5,500 అక్రమంగా విక్రయించారు.. బిర్జు ఉపాధ్యాయ్ తన భార్య కుమారుడు అత్త సహకారంతో కర్ణాటక నుండి హైదరాబాద్ కి డ్రగ్ సరఫరా చేసేవాడు అని ఆయన చెప్పుకొచ్చారు. బిర్జు తన బంధువు రాను భాయి అనే వ్యక్తికి టాబ్లెట్స్ ఇచ్చి కర్ణాటక నుండి హైదరాబాద్ పంపాడు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సాండిల్య చెప్పారు.
Read Also: Rohit Sharma: నెదర్లాండ్స్తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
ఈ టాబ్లెట్స్ ను మాంగర్ బస్తీలో నివాసం ఉంటున్న రాజు, పల్లవి అనే తన బంధువులకు సరఫరా చేయాల్సి ఉంది.. ఈ క్రమంలో నిందితుడు రాను భాయి కర్ణాటక నుండి నైట్రావెట్ ట్యాబ్లెట్లను తీసుకుని Mgbs లో బస్సు దిగాడు అని సందీప్ సాండిల్య తెలిపారు. నైట్రావెట్ మాత్రలను మాంగేర్ బస్తీలోని హబీబ్నగర్ ను తీసుకు వెళ్తూ ఉండగా టీఎస్న్యాబ్, అఫ్జల్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆపై మంగర్బస్తీలోని నిందితుల ఇంటిపై దాడి చేసారు.. నిందితుల నివాసంలో 11 బాక్స్ల నైట్రావెట్ టాబ్లెట్లు 22 ఎస్కుఫ్ సిరప్ లను సీజ్ చేసాం.. బంగారు బస్తిలోని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు బీదర్ లోని బిరుసు ఫ్యామిలీ పట్టుకునేందుకు హెచ్న్యూకి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది వెళ్ళారు.. నిందితులు ఇంటిపై ఈ నెల నాలుగో తేదీన తెల్లవారుజామున 1 గంటలకు రైడ్ చేశారు.. ఉమ్మడి కుటుంబం కావడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కలిసి మా పోలీసులపై దాడి చేశారు అని హైదరాబాద్ సీపీ సందీప్ సాండిల్య వెల్లడించారు.
తాజావార్తలు
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!