Jhansi Fire Incident: షార్ట్సర్క్యూట్ కాదు.. ఆస్పత్రిలో నర్సు అగ్గిపుల్ల వెలిగించింది?
- ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్వార్డ్లో అగ్ని ప్రమాదం
- 10 మంది చిన్నారులు మృతి
- ప్రాథమిక విచారణలో షార్ట్సర్క్యూట్ అని తేల్చిన అధికారులు
- ఆస్పత్రిలో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందన్న ప్రత్యక్ష సాక్షి
- అప్పుడే మంటలు చెలరేగాయని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్వార్డ్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో16 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు భిన్నమైన వార్తలు వస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ పైపును కనెక్ట్ చేసేందుకు ఓ నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని, అగ్గిపుల్ల వెలిగిన వెంటనే వార్డు మొత్తం మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
READ MORE: Ponnam Prabhakar: గీతా కార్మికులకు త్వరలో మోపెడులు.. గుడ్ న్యూస్ చెప్పిన పొన్నం ప్రభాకర్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్లో తన కొడుకును చేర్చిన వారిలో హమీర్పూర్ నివాసి భగవాన్ దాస్ ఒకరు. నిన్న మంటలు చెలరేగినప్పుడు.. భగవాన్ దాస్ వార్డులో ఉన్నాడు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. కానీ ఈ ఘటన వెనుక అసలు కారణాన్ని ప్రత్యక్ష సాక్షి భగవాన్ దాస్ చెప్పాడు. భగవాన్ దాస్ ప్రకారం.. పిల్లల వార్డులో ఆక్సిజన్ సిలిండర్ పైపును కనెక్ట్ చేయడానికి నర్సు అగ్గిపుల్లని వెలిగించింది. ఆమె అగ్గిపెట్టె వెలిగించిన వెంటనే, వార్డు మొత్తం మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే, భగవాన్ దాస్ 3 నుంచి 4 మంది పిల్లలను తన మెడకు చుట్టికుని బయటకు పరిగెత్తాడు. కొంత మందిని రక్షించాడు.
READ MORE:Myke Tyson vs Jake Paul Fight: మైక్ టైసన్ను మట్టి కరిపించిన 27 ఏళ్ల యూట్యూబర్
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక అలారం మోగింది. కానీ.. ఆ వార్డులో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. సిలిండర్లో నింపిన లిక్విడ్ను గడువు తేదీ కూడా ముగిసినట్లు తేలింది. అంటే అగ్నిమాపక యంత్రం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా.. ఈ సిలిండర్లు ఖాళీగా ఉన్నాయని చూపించేందుకు ఇక్కడే ఉంచారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..