Amol Muzumdar: మహిళల వన్డే ప్రపంచ కప్ నిజమైన ఛాంపియన్.. ఈయనే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amol Muzumdar: టీమిండియా కల నిజమైన క్షణం అది.. చాలా కాలంగా కోట్లాది మంది స్నప్నాన్ని నిజం చేస్తూ మహిళల వన్డే ప్రపంచ కప్ను భారత మహిళా జట్టు ముద్దాడి క్షణం అది.. గెలిచిన తర్వాత ఆనందంతో కన్నీటి పర్యంతం అయిన భారత మహిళా జట్టు గురించి దేశం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది. కానీ ఇక్కడ ప్రపంచం, దేశం.. అందరూ తెలుసుకోవాల్సిన నిజమైన ఛాంపియన్ ఎవరో తెలుసా.. అమోల్ ముజుందార్. ఆయన తన కెరీర్లో ఎప్పుడూ కూడా భారత జట్టు జెర్సీని ధరించకపోయినా, దేశం కోసం ఆడిన వారు కూడా చేయలేనిది సాధించాడు. ముంబైకి చెందిన ఈ మాజీ రంజీ ప్లేయర్ టీమిండియాను ప్రపంచ ఛాంపియన్గా చేయడంలో కీ రోల్ పోషించాడంటే అతిశయోక్తి కాదు. భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Chevella Accident : చేవెళ్ల ప్రమాదం వెనుక నిజాలు బహిర్గతం చేసిన ప్రత్యక్ష సాక్షి !
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
అమోల్ మజుందార్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్ను 1993లో ముంబై జట్టుతో ప్రారంభించాడు. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో అమోల్ మజుందార్ 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 11,000 పరుగులు సాధించాడు. ఈ కాలంలో ఆయన 30 సెంచరీలు చేశాడు. కానీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. రంజీల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన భారత జట్టులో అవకాశం రాకపోవడంతో అమోల్ ముజుందార్ నిరాశ చెందాడు. దీంతో ఆయన 2014లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి కోచింగ్ వైపు మొగ్గు చూపాడు. ఆయన తన కెరీర్లో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లతో కలిసి పనిచేశాడు. ఈ సమయంలో ఆయనకు గొప్ప పేరు వచ్చింది. అక్టోబర్ 2023లో ఆయన భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. ఆ సమయంలో దేశం తరపున ఎప్పుడూ ఆడని వ్యక్తి కోచ్ ఎలా అవుతాడని చాలామంది ప్రశ్నించారు. కానీ ఆయన భారత మహిళా జట్టుకు అందించిన అపూర్వ విజయంతో ఇప్పుడు ప్రశ్నించిన వారందరి నోళ్లు మూతపడ్డాయి.
జట్టును గెలుపు దిశను మార్చిన వ్యక్తి..
వన్డే ప్రపంచ కప్లో భారత మహిళా జట్టు 2005, 2017లో ఫైనల్కు చేరుకుంది. కానీ ఎప్పుడూ కూడా ఛాంపియన్గా అవతరించలేదు. అయితే ఈసారి టీమిండియా గతానికి భిన్నమైన అద్భుత ప్రదర్శన చేసి కలను నిజం చేసుకుంటూ ట్రోఫీని ముద్దాడింది. దీనికి ప్రధాన కారణం భారత మహిళా జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్. ఆయన శిక్షణలో క్రీడాకారులు రాటుదేలి, కప్ను ముద్దాడారు. ఆయనకు ఈ చిరస్మరణీయమైన విజయం అంత సులభంగా లభించలేదు. క్రీడాకారులతో సమానంగా ఆయన కష్టపడి పనిచేశాడు. జట్టులోని వారి బలహీనతలను తెలుసుకొని వారిని ఆ బలహీనతలను అధిగమించేలా అనునిత్యం ప్రోత్సహిస్తూ వారిని విజయం దిశగా నడించాడు.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్కు ముందు మజుందార్ డ్రెస్సింగ్ రూమ్ వైట్బోర్డ్పై ఒకే ఒక లైన్ రాశారని చెప్పారు. “ఫైనల్కు చేరుకోవడానికి మనం వారి కంటే ఎక్కువ పరుగులు చేయాలి, అంతే.” ఆ లైన్ సరళంగా అనిపించవచ్చు, కానీ అది మా హృదయాల్లో నిలిచిపోయింది. మజుందార్ నిర్ణయించుకున్నట్లుగా జెమిమా రోడ్రిగ్స్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసింది. ఆమె చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిందని ఆమె చెప్పారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత అమోల్ మజుందార్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది. ఆయన ఈ విజయానికి ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది ఒక కల. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంపై ఆయనకున్న బాధ అనేది భారత మహిళా జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించడంతో తొలగిపోయింది.
అమోల్ మజుందార్ పాదాలను తాకిన హర్మన్ప్రీత్ కౌర్ ..
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ హెడ్ కోచ్ అమోల్ మజుందార్ పాదాలను తాకి, ఆలింగనం చేసుకుంది. ఈ చిత్రం టీమిండియా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే చిత్రం. ఈ సంఘటన ఆమెకు కోచ్పై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కోచ్ అమోల్ గురించి మాట్లాడుతూ.. “గత రెండు సంవత్సరాలుగా సర్ సహకారం అద్భుతంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత అంతా బాగానే జరిగింది. ఆయన మమ్మల్ని పగలు, రాత్రి ప్రాక్టీస్ చేయించి, ఏలా తమ ఆట తీరును మెరుగుపరుచుకోవాలో చెప్పారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు లభించినందుకు నేను నిజంగా సంతోషంగా గర్విస్తున్నాను” అని అన్నారు.
READ ALSO: US Airstrikes Nigeria: క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు.. ఇక వారికి చావే!
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!