Amit Shah Tour: ఎన్నికలే టార్గెట్.. దక్షిణాది రాష్ట్రాల్లో అమిత్ షా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అధికార పార్టీ బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతలు పర్యటిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరపున పరివర్తన్ యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈనెల 28, 29 తేదీల్లో తమిళనాడు, తెలంగాణలో పర్యటించనున్నారు. తమిళనాడులో రాష్ట్ర బీజేపీ పరివర్తన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అటు తెలంగాణలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
YadammaRaju: జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడ గరిష్ట సంఖ్యలో స్థానాలపై బిజెపి తన పట్టును పటిష్టం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
BlueTea Benefits : బ్లూటీని రోజూ ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ రోగాలు జన్మలో రావు..
తమిళనాడులో పర్యన అనంతరం.. అమిత్ షా మరుసటి రోజు తెలంగాణకు చేరుకోనున్నారు. హైదరాబాద్లో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలో పార్టీ పని తీరును సమీక్షించనున్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు బయటకు వచ్చాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గత నెలలో ఓ వివాదాస్పద పోస్ట్ చేయడంతో రాష్ట్రంలోని బీజేపీ నేతల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై అమిత్ షా ఇప్పటికే పలువురు నేతలకు సూచనలు చేశారని, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారని, దీని తర్వాత కూడా నేతల మధ్య విభేదాలు వీడటం లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జులై 29న జరగనున్న సమావేశంలో నేతలకు షా నుంచి గట్టి వార్నింగ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!