Amit Shah Tour: ఎన్నికలే టార్గెట్.. దక్షిణాది రాష్ట్రాల్లో అమిత్ షా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అధికార పార్టీ బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతలు పర్యటిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరపున పరివర్తన్ యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈనెల 28, 29 తేదీల్లో తమిళనాడు, తెలంగాణలో పర్యటించనున్నారు. తమిళనాడులో రాష్ట్ర బీజేపీ పరివర్తన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అటు తెలంగాణలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
YadammaRaju: జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడ గరిష్ట సంఖ్యలో స్థానాలపై బిజెపి తన పట్టును పటిష్టం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
BlueTea Benefits : బ్లూటీని రోజూ ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ రోగాలు జన్మలో రావు..
తమిళనాడులో పర్యన అనంతరం.. అమిత్ షా మరుసటి రోజు తెలంగాణకు చేరుకోనున్నారు. హైదరాబాద్లో జరిగే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలో పార్టీ పని తీరును సమీక్షించనున్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు బయటకు వచ్చాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గత నెలలో ఓ వివాదాస్పద పోస్ట్ చేయడంతో రాష్ట్రంలోని బీజేపీ నేతల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై అమిత్ షా ఇప్పటికే పలువురు నేతలకు సూచనలు చేశారని, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారని, దీని తర్వాత కూడా నేతల మధ్య విభేదాలు వీడటం లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జులై 29న జరగనున్న సమావేశంలో నేతలకు షా నుంచి గట్టి వార్నింగ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!