Amit Shah: మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఏక్నాథ్ షిండే కాదు.. సీఎం అభ్యర్థి ఎంపికపై షా కీలక ప్రకటన
- బీజేపీ తీర్మానం లేఖ విడుదల చేసిన షా
- సీఎం అభ్యర్థి ప్రకటనపై కీలక ప్రకటన
- ఎన్నికల తర్వాత చర్చించి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి
- ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. దీని తర్వాత.. తన ప్రసంగంలో అమిత్ షా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అని, అయితే ఎన్నికల తర్వాత అందరం కూర్చుని దీనిపై చర్చిస్తామని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ను కూడా టార్గెట్ చేశారు. ఈసారి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం శరద్ పవార్కు ఇవ్వబోమని అన్నారు. శరద్ పవార్కు తప్పుడు కథనాలు చెప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు. కానీ ఈసారి ఆయన కథలు పని చేయవన్నారు.
READ MORE: Mexico : మెక్సికన్ బార్లో విచక్షణారహితంగా కాల్పులు..10 మంది మృతి
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. బాలాసాహెబ్, సావర్కర్ను అవమానించిన వారి పక్షానే ఆయన ఉన్నారంటూ మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో భాజపా మ్యానిఫెస్టోను అమిత్ షా విడుదల చేసి మాట్లాడారు. మహా వికాస్ అఘాడీలో భాగమైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లపై ప్రజలకు నమ్మకం లేదని అమిత్ షా విమర్శించారు. ‘‘ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు. బాలాసాహెబ్, సావర్కర్లను అవమానించిన కాంగ్రెస్ పక్షానే ఉద్ధవ్ ఠాక్రే నిలబడ్డారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
READ MORE: Pawan Kalyan: మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు: డిప్యూటీ సీఎం పవన్
కాగా.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మహాయుతి కూటమి ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఈసారి అధికారంలోకి రావాలని ఎంవీఏ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!