ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, యూఎస్ ప్రెసిడెన్షియల్ “డూమ్స్డే ప్లేన్” లేదా E-4B “నైట్వాచ్” వాషింగ్టన్ DC సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయింది. అణు యుద్ధం లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఈ విమానాన్ని సాధారణంగా అమెరికా అధ్యక్షుడు లేదా అగ్ర సైనిక నాయకత్వం ఉపయోగిస్తారు. ఇది సైనిక విశ్లేషకులు, విమానయాన ట్రాకర్లలో ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నైట్వాచ్ విమానం అధునాతన కమ్యూనికేషన్ గేర్ను కలిగి ఉంది. ఇది ఆకాశంలో ఇంధనం నింపుకుంటుంది. ఇది అణు దాడి లేదా ఏ రకమైన విద్యుదయస్కాంత దాడి ద్వారా ప్రభావితం కాదు.
Also Read:Sonam Raghuvanshi: వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ.. ఇంతకీ సంజయ్ ఎవరంటే..!
E-4B “నైట్వాచ్” అధికారికంగా నేషనల్ ఎయిర్బోర్న్ ఆపరేషన్స్ సెంటర్ (NAOC) అని పిలుస్తారు. అణు విస్ఫోటనాలు, విద్యుదయస్కాంత పల్స్ (EMP) వంటి ముప్పులను తట్టుకునేలా రూపొందించారు. ఇది సెప్టెంబర్ 11, 2001 ఉగ్రవాద దాడుల సమయంలో ఉపయోగించారు. అప్పటి నుంచి అత్యంత సున్నితమైన పరిస్థితులలో మాత్రమే యాక్టివ్ చేస్తున్నారు. ఈ విమానం ఎందుకు బయలుదేరిందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విమానంలో ఉన్నారా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియకపోయినా, వర్జీనియా మీదుగా వాషింగ్టన్ డిసికి చేరుకున్న దాని టేకాఫ్ సమయం, మార్గం అమెరికా రక్షణ మౌలిక సదుపాయాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తున్నాయి.
Also Read:Gold Rates: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. నేడు తులం ఎంతంటే?
అమెరికా వద్ద అలాంటివి 4 విమానాలు
ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేయడం, ఇటీవలి క్షిపణి దాడులు మధ్యప్రాచ్యం అంతటా అస్థిరతను పెంచాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక US యుద్ధనౌకలు మోహరించాయి. F-16 యుద్ధ విమానాలు కూడా మోహరించాయి. అమెరికా వద్ద అలాంటి 4 విమానాలు ఉన్నాయి, వాటిలో కనీసం ఒకటి 24×7 ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇతర VIPలతో పాటు, సాధారణ మిషన్లను నిర్వహిస్తుంది. యుద్ధం లేదా అణు దాడి జరిగినప్పుడు, అధ్యక్షుడు, ఉన్నత సైనిక అధికారులు భూమి నుంచి సురక్షితమైన దూరం నుంచి నిర్ణయాలు తీసుకునేలా “బ్యాకప్ కమాండ్ సిస్టమ్”ను యాక్టివ్గా ఉంచడానికి అమెరికా చేసిన సన్నాహకంగా ఈ చర్య ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.