Sonam Raghuvanshi: వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ.. ఇంతకీ సంజయ్ ఎవరంటే..!
- వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ
- సంజయ్ వర్మను గుర్తించిన మేఘాలయ పోలీసులు
- వీడుతున్న హనీమూన్ మర్డర్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసు వెనుక ఉన్న మిస్టరీని మేఘాలయ పోలీసులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. ఇక 243 ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. సోనమ్.. సంజయ్ వర్మ అనే వ్యక్తి మధ్య మార్చి 1 నుంచి 25 వరకు దాదాపు 119 కాల్స్ నడిచాయి. ఇందుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సంజయ్ వర్మ ఎవరనేది తెలుసుకునేందుకు సోనమ్ రఘువంశీ సోదరుడిని కలిసి పోలీసులు వాకబు చేశారు. అసలు సంజయ్ వర్మ అనే వ్యక్తే తనకు తెలియదని చెప్పాడు. దీంతో లోతుగా రికార్డులను పరిశీలించగా.. ప్రియుడు రాజ్ కుష్వాహాగా గుర్తించారు. సోనమ్.. తన మొబైల్లో ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుంది. దీంతో సంజయ్ వర్మ పేరుతో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా తేల్చారు. మొత్తానికి వివాహానికి ముందు.. తర్వాత ఇద్దరి మధ్య 200 ఫోన్ కాల్స్ నడిచాయి.
ఇది కూడా చదవండి: ENG vs IND: సెలెక్షన్ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్.. తన ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుందని మేఘాలయ పోలీసులు తెలిపారు. 39 రోజుల్లో ఇద్దరు కలిసి 239 సార్లు కాల్స్ మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ నెంబర్ స్విచ్ఛాఫ్లో ఉందని పేర్కొన్నారు. ఇక నిందితులకు సోనమ్ బంధువు జితేంద్ర యూపీఐ నుంచి నగదు చెల్లించారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సోనమ్తో తన కుటుంబానికి అన్ని సంబంధాలు తెగిపోయాయని గోవింద్ తెలిపాడు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని సోనమ్ సోదరుడు గోవింద్ చెప్పాడు.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడితో హోటల్లో ఉండగా భర్త ప్రత్యక్షం.. వివాహిత ఏం చేసిందంటే..!
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీతో యూపీకి చెందిన సోనమ్తో మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అనంతరం మే 23న జంట అదృశ్యమైంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. దీంతో అతడు హత్యకు గురైనట్లుగా తేల్చారు. అనంతరం భార్య సోనమ్ కోసం గాలిస్తుండగా అకస్మాత్తుగా జూన్ 8న ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. అనంతరం సోనమ్ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. ముగ్గురు హంతక ముఠా సహా ప్రియుడు రాజ్ కుష్వాహాను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!