Sonam Raghuvanshi: వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ.. ఇంతకీ సంజయ్ ఎవరంటే..!
- వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ
- సంజయ్ వర్మను గుర్తించిన మేఘాలయ పోలీసులు
- వీడుతున్న హనీమూన్ మర్డర్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసు వెనుక ఉన్న మిస్టరీని మేఘాలయ పోలీసులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. ఇక 243 ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. సోనమ్.. సంజయ్ వర్మ అనే వ్యక్తి మధ్య మార్చి 1 నుంచి 25 వరకు దాదాపు 119 కాల్స్ నడిచాయి. ఇందుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సంజయ్ వర్మ ఎవరనేది తెలుసుకునేందుకు సోనమ్ రఘువంశీ సోదరుడిని కలిసి పోలీసులు వాకబు చేశారు. అసలు సంజయ్ వర్మ అనే వ్యక్తే తనకు తెలియదని చెప్పాడు. దీంతో లోతుగా రికార్డులను పరిశీలించగా.. ప్రియుడు రాజ్ కుష్వాహాగా గుర్తించారు. సోనమ్.. తన మొబైల్లో ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుంది. దీంతో సంజయ్ వర్మ పేరుతో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా తేల్చారు. మొత్తానికి వివాహానికి ముందు.. తర్వాత ఇద్దరి మధ్య 200 ఫోన్ కాల్స్ నడిచాయి.
ఇది కూడా చదవండి: ENG vs IND: సెలెక్షన్ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్
Also Read
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్.. తన ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుందని మేఘాలయ పోలీసులు తెలిపారు. 39 రోజుల్లో ఇద్దరు కలిసి 239 సార్లు కాల్స్ మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ నెంబర్ స్విచ్ఛాఫ్లో ఉందని పేర్కొన్నారు. ఇక నిందితులకు సోనమ్ బంధువు జితేంద్ర యూపీఐ నుంచి నగదు చెల్లించారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సోనమ్తో తన కుటుంబానికి అన్ని సంబంధాలు తెగిపోయాయని గోవింద్ తెలిపాడు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని సోనమ్ సోదరుడు గోవింద్ చెప్పాడు.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడితో హోటల్లో ఉండగా భర్త ప్రత్యక్షం.. వివాహిత ఏం చేసిందంటే..!
ఇండోర్కు చెందిన రాజా రఘువంశీతో యూపీకి చెందిన సోనమ్తో మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అనంతరం మే 23న జంట అదృశ్యమైంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. దీంతో అతడు హత్యకు గురైనట్లుగా తేల్చారు. అనంతరం భార్య సోనమ్ కోసం గాలిస్తుండగా అకస్మాత్తుగా జూన్ 8న ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. అనంతరం సోనమ్ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. ముగ్గురు హంతక ముఠా సహా ప్రియుడు రాజ్ కుష్వాహాను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!