Maldives Election: మాల్దీవులలో ఎన్నికలు.. భారత్లో బ్యాలెట్ బాక్స్లు?.. విషయం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Election: మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. సుమారు 11,000 మంది మాల్దీవులకు చెందినవారు తమ పోలింగ్ స్టేషన్లను తరలించడానికి రీ-రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు సమర్పించారని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 21న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం శనివారం కోరింది.
మాల్దీవుల ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కేరళ రాజధాని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్లో కూడా ఉంచుతామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మూడు దేశాల్లో కనీసం బ్యాలెట్ బాక్స్ పెట్టేందుకు అవసరమైన ఓటర్ల తమ పేరును నమోదు చేసుకున్నారని పేర్కొంది. ఇతర దేశాల్లో నివసిస్తున్న పౌరుల కోసం రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించబడిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. వెబ్ పోర్టల్ ‘Adadhu.com’ ప్రకారం, ఎన్నికల కమిషన్ సెక్రటరీ జనరల్ హసన్ జకారియా మాట్లాడుతూ.. “గతంలో లాగా, శ్రీలంక, మలేషియాలో చాలా మంది నమోదు చేసుకున్నారు. భారతదేశంలోని తిరువనంతపురంలో 150 మంది నమోదు చేసుకున్నారు, కాబట్టి మేము అక్కడ బ్యాలెట్ పెట్టెను ఉంచాలని నిర్ణయించుకున్నాము.” అని తెలిపారు.
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
Read Also: Vladimir Putin : రష్యాలో ఏకపక్ష విజయం.. చైనా, దేశద్రోహులపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్
ఈ సమయంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి నమోదు చేసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు 11,169 దరఖాస్తులు వచ్చాయి. న్యూస్ పోర్టల్ ‘Edition.mv’ ప్రకారం, కమిషన్ 1,141 ఫారమ్లను తిరస్కరించింది. నమోదు కోసం మొత్తం దరఖాస్తుల సంఖ్య 10,028కి చేరుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది తిరిగి నమోదు చేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్న జకారియా.. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), థాయ్లాండ్లలో ఓటింగ్ జరగదని చెప్పారు.
మాల్దీవుల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఆదివారం జరగాల్సి ఉండగా, రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహించకుండా చట్టాన్ని సవరించడంతో ఎన్నికల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 21న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మాల్దీవుల్లోని 93 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 389 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 90 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రధాన భారత అనుకూల ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) నుండి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు. దీని తర్వాత 89 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC)ల పాలక కూటమి ఉంది. చైనా అనుకూల వ్యక్తిగా భావించే అధ్యక్షుడు మహ్మద్ ముయిజు గత ఏడాది భారత వ్యతిరేక వైఖరితో అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!