Ambati Rambabu: నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం..!
- కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు..
- వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న అంబటి రాంబాబు..
- నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం..
- కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని వార్నింగ్..
Ambati Rambabu: కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం.. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లో సంవత్సరం కావస్తుంది.. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, విశ్వసనీయత, ప్రజల కొనుగోళ్లు అన్ని బాగున్నాయి.. రాష్ట్రం అభివృద్ధి చెందింది.. కూటమి ఏడాది పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం తిరోగమనం దిశగా అడుగులు వేస్తుందని విమర్శించారు.. వైఎస్ జగన్ ను ఏ విధంగా ఇబ్బంది పెడదాం అనే ధ్యాస తప్ప ప్రభుత్వానికి ఏమీ లేదు.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ఏమీ లేదు.. ప్రజలు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు అన్నారు అంబటి..
Read Also: Nara Lokesh: రెడ్ బుక్ మరువను..! కేడర్ను ఇబ్బంది పెట్టినవారిని వదలను..
Also Read
వైఎస్ జగన్ మొదట బిజినెస్లో భాగంగా భారతి సిమెంట్ ను ప్రారంభించారు. లేని పోనీ కారణాలు చూపించి భారతి సిమెంట్ సంస్థ సెక్రెటరీ బాలాజీ గోవిందప్పను విజయవాడ జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఐజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీ ప్రతినిధులను భయపెడితే ఏ విధంగా ఏపీకి పరిశ్రమలు వస్తాయి.? అని ప్రశ్నించారు.. రౌడీ మాములు ఇవ్వకపోతే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వమని కూటమి ప్రజా ప్రతినిధులు తెగేసి చెప్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రజా ప్రతినిధులు బరితెగించి మరి దోచుకుంటున్నారు. కప్పం కట్టలేదని పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు సిమెంట్ కంపెనీలు మూసేయించాడు అని ఫైర్ అయ్యారు.. జాతీయ రహదారి కాంట్రాక్ట్ ల కోసం సీఎం రమేష్ , నారాయణరెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు కొట్టుకుంటున్నారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసి, ఏడాది పాలన పూర్తి చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామని బాధ పడుతున్నారు.. గత ఐదేళ్ల వైసీపీనే బాగుంది అని ప్రజలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. ఇక, రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి రెవిన్యూ తగ్గిపోయిందన్న రాంబాబు.. మోసానికి మారుపేరు చంద్రబాబు. అసలు ఒక పథకం అమలు చేయడానికి ఎంత బడ్జెట్ కావాలి, మీరు కేటాయిస్తుంది ఎంత..? అని ప్రశ్నించారు.. ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి..? అని నిలదీశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!