Ambati Rambabu : జనంపై విద్యుత్ చార్జీల భారం మోపుతున్నారు
- జనంపై విద్యుత్ చార్జీల భారం మోపుతున్నారు. రెండు విడతల్లో రూ.17 వేల కోట్ల భారం వేశారు. కరెంట్ చార్జీలు తగ్గిస్తామన్న బాబు మాట తప్పారు. -అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనలు వ్యక్తం చేసింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు మీరు మాకు ఓటు వేయండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. తగ్గించడం సంగతి దేవుడు ఎరుగు ,చార్జీల మోత మోగుతుందన్నారు అంబటి రాంబాబు. వైసీపీకి 11 సీట్లు అనుకోవద్దు, సంబర పడవద్దు… 40 శాతం ఓట్లు ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు అంబటి రాంబాబు. అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాదని, కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశామా ,అని ప్రజలు బాధపడుతున్నారని, ప్రజల తరఫున పోరాడితే, వైసీపీ నాయకులు పై సోషల్ మీడియా పేరుతో కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
MLC Kavitha: రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ చార్జీలు వసూలు చేయాలని చూస్తుందని, ఆ విషయాన్ని నిలదీస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. నాతో సహా ,వైసీపీ సీనియర్ నాయకులు, అందరి మీద కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడి రాజకీయాలు చేసేవాళ్లం కాదన్నారు అంబటి రాంబాబు. విద్యుత్ చార్జీలతోపాటు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక, పరిపాలనపై వైసీపీ పోరాడుతూనే ఉంటుందని, వరి రైతుకు కనీసం 1740 గిట్టుబాటు ధర, ప్రభుత్వం చెల్లించాలన్నారు అంబటి రాంబాబు. కానీ ఒక్క బస్తా కూడా గిట్టుబాటు ధరకు కొనలేదని, 1300కు, 1400కు బేరాలు ఆడి మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారన్నారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఫైర్!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!