Ambati Rambabu : కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నది పంపకాలకు సంబంధించి దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని, 2010లో తుది నివేదిక ఇచ్చిందన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని రాష్ట్రం సుప్రీంకోర్టు లో ఎస్ఎల్పీ వేసిందన్నారు మంత్రి అంబటి. అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఆ తర్వాత కేంద్రం మరో ట్రిబ్యునల్ వేసిందన్నారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కొనసాగింపు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు టీఓఆర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమని, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పటికే విధివిధానాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
కొత్త విధివిధానాలు అప్పగించటం చట్ట విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారన్నారు. న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసిన ఒక్క నీటి బొట్టును వదులుకోమన్నారు. అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి లో పవన్ కల్యాణ్కు కూడా వాటా ఉందని, అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయని, పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
అక్రమంగా అరెస్టు చేశారు అంటున్న వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదా?? అని ఆయన ప్రశ్నించారు. రోజుకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు చంద్రబాబు తరపున వాదించారని, అంత మేధావులు, సీనియర్ లాయర్లు వచ్చి వాదించినా చంద్రబాబుకు ఊరట లభించ లేదన్నారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు ఊరట ఇవ్వటం లేదని, టీడీపీ లైట్లు ఎప్పుడో ఆర్పాయని, చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పాడన్నారు
తాజావార్తలు
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!