Ambati Rambabu : కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నది పంపకాలకు సంబంధించి దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని, 2010లో తుది నివేదిక ఇచ్చిందన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని రాష్ట్రం సుప్రీంకోర్టు లో ఎస్ఎల్పీ వేసిందన్నారు మంత్రి అంబటి. అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఆ తర్వాత కేంద్రం మరో ట్రిబ్యునల్ వేసిందన్నారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కొనసాగింపు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు టీఓఆర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమని, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పటికే విధివిధానాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
కొత్త విధివిధానాలు అప్పగించటం చట్ట విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారన్నారు. న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసిన ఒక్క నీటి బొట్టును వదులుకోమన్నారు. అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి లో పవన్ కల్యాణ్కు కూడా వాటా ఉందని, అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయని, పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అక్రమంగా అరెస్టు చేశారు అంటున్న వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదా?? అని ఆయన ప్రశ్నించారు. రోజుకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు చంద్రబాబు తరపున వాదించారని, అంత మేధావులు, సీనియర్ లాయర్లు వచ్చి వాదించినా చంద్రబాబుకు ఊరట లభించ లేదన్నారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు ఊరట ఇవ్వటం లేదని, టీడీపీ లైట్లు ఎప్పుడో ఆర్పాయని, చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పాడన్నారు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!