Ambati Rambabu : కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నది పంపకాలకు సంబంధించి దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని, 2010లో తుది నివేదిక ఇచ్చిందన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని రాష్ట్రం సుప్రీంకోర్టు లో ఎస్ఎల్పీ వేసిందన్నారు మంత్రి అంబటి. అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఆ తర్వాత కేంద్రం మరో ట్రిబ్యునల్ వేసిందన్నారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కొనసాగింపు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు టీఓఆర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమని, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పటికే విధివిధానాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
కొత్త విధివిధానాలు అప్పగించటం చట్ట విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారన్నారు. న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసిన ఒక్క నీటి బొట్టును వదులుకోమన్నారు. అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి లో పవన్ కల్యాణ్కు కూడా వాటా ఉందని, అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయని, పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
అక్రమంగా అరెస్టు చేశారు అంటున్న వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదా?? అని ఆయన ప్రశ్నించారు. రోజుకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు చంద్రబాబు తరపున వాదించారని, అంత మేధావులు, సీనియర్ లాయర్లు వచ్చి వాదించినా చంద్రబాబుకు ఊరట లభించ లేదన్నారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు ఊరట ఇవ్వటం లేదని, టీడీపీ లైట్లు ఎప్పుడో ఆర్పాయని, చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పాడన్నారు
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!