Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్తో పాటు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాయపూడి నుంచి ఉండవల్లి వరకు రహదారి
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి వరకు పనులు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలోని పలు ముఖ్య ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజలకు, వాహనదారులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఇక, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో చేపట్టారు. రాజధాని ప్రాంతంలో మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తవడంతో రాజధాని నగరానికి మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది.
Also Read
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
జాతీయ రహదారి-16కు అనుసంధానం
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని దశలవారీగా విస్తరించే ప్రణాళిక ఉంది. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి-16కు అనుసంధానించేలా రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో అమరావతికి జాతీయ రహదారి నెట్వర్క్తో మరింత మెరుగైన కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ బ్రిడ్జిలను కాలినడకన పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి, బ్రిడ్జి నిర్మాణంతో రాజధాని ప్రాంతంలో వాహన రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఇక పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు
సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో నేటి నుంచి ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రజలు, స్థానికులు, వాహనదారులకు ఈ రహదారి కీలకంగా మారనుంది. ప్రారంభ కార్యక్రమానికి రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!