Muhajir in Pakistan: ‘ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి’.. పాక్ నాయకుడు పీఎం మోడీకి విజ్ఞప్తి
- ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి
- అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన ముహాజీర్లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
Also Read:Jailer2 : రజనీకాంత్కి విలన్గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్రా మామ
Also Read
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
తన ప్రకటనలో.. బలూచ్ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీని ఆయన ప్రశంసించారు. దీనిని సాహసోపేతమైన, నైతికంగా ప్రశంసనీయమైన చర్యగా అభివర్ణించారు. ముహాజిర్ సమాజానికి కూడా ఇలాంటి మద్దతు కోసం స్వరం పెంచాలని ఆయన ప్రధాని మోడీని అభ్యర్థించారు. ముహాజీర్లు దశాబ్దాలుగా అణచివేత, వివక్షను ఎదుర్కొంటున్నారని అల్తాఫ్ చెప్పారు. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ముహాజీర్లను దేశ చట్టబద్ధమైన పౌరులుగా పూర్తిగా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఈ అణగారిన వర్గాల హక్కులను MQM నిరంతరం సమర్థించింది. కానీ పాక్ సైనిక చర్య ఇప్పటివరకు 25,000 మందికి పైగా ముహాజీర్ల మరణానికి దారితీసిందని అన్నారు.
Also Read:Jailer2 : రజనీకాంత్కి విలన్గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్రా మామ
అమెరికాలోని హ్యూస్టన్లోని పాకిస్తాన్ కాన్సుల్ జనరల్ అఫ్తాబ్ చౌదరి ఈ కార్యక్రమంలో అల్తాఫ్, ఎంక్యూఎంలను భారతదేశ ఏజెంట్లుగా చూపించిన వీడియోను ప్రదర్శించారని అల్తాఫ్ హుస్సేన్ చెప్పారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ముహాజీర్ల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్లో ముహాజీర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోడీ ఈ వలసదారుల గొంతుకను వినిపించాలని, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ సమాజంలోని ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!