Muhajir in Pakistan: ‘ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి’.. పాక్ నాయకుడు పీఎం మోడీకి విజ్ఞప్తి
- ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి
- అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన ముహాజీర్లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
Also Read:Jailer2 : రజనీకాంత్కి విలన్గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్రా మామ
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తన ప్రకటనలో.. బలూచ్ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీని ఆయన ప్రశంసించారు. దీనిని సాహసోపేతమైన, నైతికంగా ప్రశంసనీయమైన చర్యగా అభివర్ణించారు. ముహాజిర్ సమాజానికి కూడా ఇలాంటి మద్దతు కోసం స్వరం పెంచాలని ఆయన ప్రధాని మోడీని అభ్యర్థించారు. ముహాజీర్లు దశాబ్దాలుగా అణచివేత, వివక్షను ఎదుర్కొంటున్నారని అల్తాఫ్ చెప్పారు. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ముహాజీర్లను దేశ చట్టబద్ధమైన పౌరులుగా పూర్తిగా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఈ అణగారిన వర్గాల హక్కులను MQM నిరంతరం సమర్థించింది. కానీ పాక్ సైనిక చర్య ఇప్పటివరకు 25,000 మందికి పైగా ముహాజీర్ల మరణానికి దారితీసిందని అన్నారు.
Also Read:Jailer2 : రజనీకాంత్కి విలన్గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్రా మామ
అమెరికాలోని హ్యూస్టన్లోని పాకిస్తాన్ కాన్సుల్ జనరల్ అఫ్తాబ్ చౌదరి ఈ కార్యక్రమంలో అల్తాఫ్, ఎంక్యూఎంలను భారతదేశ ఏజెంట్లుగా చూపించిన వీడియోను ప్రదర్శించారని అల్తాఫ్ హుస్సేన్ చెప్పారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ముహాజీర్ల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్లో ముహాజీర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోడీ ఈ వలసదారుల గొంతుకను వినిపించాలని, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ సమాజంలోని ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!