Congo: కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!
- కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం..
- పడవ బోల్తా పడటంతో 38 మంది మృతి..
- ఈ ప్రమాదంలో మరో 100 మందికి పైగా గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congo: కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించిన ఘటలో 100 మందికి పైగా తప్పిపోయారని అధికారులు చెప్పుకొచ్చారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే, ఫెర్రీ బోటులో 400 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వారంతా క్రిస్మస్ వేడుకల కోసం సొంతూళ్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం నెలకొందని చెప్పారు. ఇక, గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 20 మందిని రక్షించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Game Changer : కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్
Also Read
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
అయితే, ఫెర్రీ బోటు సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం సైతం ఓ నదిలో పడవ బోల్తా పడి దాదాపు 25 మంది వరకు చనిపోయారు. ఈ క్రమంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించొద్దని అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు పడవల నిర్వహాకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!