Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం.. సీఎం బీరెన్ సింగ్ను తొలగించాలని డిమాండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు. మే ప్రారంభంలో మణిపూర్ లో 4 రోజుల పర్యటన సందర్భంగా అమిత్ షా శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Viral Video: తన గుడ్లను తీస్తున్న వ్యక్తిపై కొండచిలువ దాడి.. షాకింగ్ వీడియో
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అయితే సమావేశం ముగిసిన తర్వాత మణిపూర్ ఇన్ఛార్జ్ మరియు బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో అందరూ తమ అభిప్రాయాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. మణిపూర్లో అమిత్ షా పర్యటన అపూర్వమని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయన్నారు. ప్రతిరోజూ ప్రధాని మోదీకి పరిస్థితి గురించి తెలియజేస్తున్నామని అమిత్ షా తెలిపారని పేర్కొన్నారు. మయన్మార్పై 10 కిలోమీటర్ల కంచె ఏర్పాటు చేశామని.. అక్కడ నుండి చొరబాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆయన సూచనలు తీసుకున్నట్లు తెలుపగా.. ప్రజల పలు సూచనలను అమిత్ షా గుర్తించారన్నారు. సరైన సమయంలో సరైన దిశలో తదుపరి చర్యలు తీసుకోబడతాయని సంబిత్ పేర్కొన్నారు.
Read Also: Rashmi Gautam Hot: రష్మీ కూడా క్లీవేజ్ షో మొదలెట్టేసింది.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
మరోవైపు ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. మణిపూర్ సీఎంను తొలగించాలన్న డిమాండ్ ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. ఈ సీఎం ఉన్నంత మాత్రాన శాంతిభద్రతలు సాధ్యం కాదన్నది ప్రతిపక్షాలు చెబుతున్న మాట అని మనోజ్ తెలిపారు. అదే సమయంలో, శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, మణిపూర్కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకురావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయని, అంతేకాకుండా మణిపూర్ ప్రజల్లో నెలకొన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలైన తాము కోరినట్లు తెలిపారు. మణిపూర్కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని అఖిలపక్ష సమావేశంలో హోంమంత్రిని కోరామని డీఎంకే నేత తిరుచ్చి శివ చెప్పారు. త్వరలో శాంతి నెలకొనాలని.. ఈ హింసకాండ వల్ల రాష్ట్రంలో 100 మంది మరణించారని.. 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని శివ అన్నారు.
తాజావార్తలు
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!