Jio : ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ జియో.. రికార్డు సృష్టించిన ఆకాష్ అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio : ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. వీరి ఖాతాదారుల సంఖ్య 49 కోట్లు. రిలయన్స్ జియో ఐపీవో కూడా వచ్చే ఏడాదిలో రాబోతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీవో కావచ్చు. ఆ తర్వాత రిలయన్స్ జియో విలువ రూ. 10 లక్షల కోట్లు కావచ్చు.
డేటా ట్రాఫిక్లో అంటే వినియోగంలో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించిందని రిలయన్స్ జియో శనివారం తెలిపింది. తలసరి డేటా వినియోగం నెలకు 30.3 జీబీకి అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ జీబీకి పెరిగిందని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో డేటా ట్రాఫిక్లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియో జూన్ త్రైమాసిక డేటా ప్రకారం.. , డేటా వినియోగం 32.8 శాతం పెరిగి 44 బిలియన్ గిగాబైట్లకు (జిబి) చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 33.2 బిలియన్ జిబి.
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
Read Also:Tolly Wood: చిన్న సినిమా.. పేద విజయం.. ఏమిటా సినిమా..?
13 కోట్ల మంది 5జీ వినియోగదారులు
సంస్థ మొత్తం కస్టమర్ల సంఖ్య సుమారు 49 కోట్లకు చేరుకుంది. ఇందులో 13 కోట్ల మంది 5G వినియోగదారులు ఉన్నారు. దీంతో చైనాను పక్కన పెడితే 5జీ సేవల పరంగా జియో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ నాణ్యమైన, అధిక కవరేజ్, సరసమైన ఇంటర్నెట్ డిజిటల్ ఇండియాకు వెన్నెముక అని, జియో దీనికి సహకరించడం గర్వంగా ఉందని అన్నారు. మా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు 5G, AI రంగంలో ఆవిష్కరణ.. స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు. కస్టమర్ ఫస్ట్ అప్రోచ్తో, జియో తన అత్యుత్తమ నెట్వర్క్, వినూత్న సేవా ఆఫర్లతో తన మార్కెట్ నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ నెట్వర్క్లో వాయిస్ కాలింగ్ రికార్డు స్థాయి 1,420 బిలియన్ నిమిషాలకు చేరుకుంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ.
Read Also:Odisha : తాంత్రికపూజల పేరుతో యువతి తలలోకి 70 సూదులు.. బాబా అరెస్ట్
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!