Jio : ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ జియో.. రికార్డు సృష్టించిన ఆకాష్ అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio : ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. వీరి ఖాతాదారుల సంఖ్య 49 కోట్లు. రిలయన్స్ జియో ఐపీవో కూడా వచ్చే ఏడాదిలో రాబోతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీవో కావచ్చు. ఆ తర్వాత రిలయన్స్ జియో విలువ రూ. 10 లక్షల కోట్లు కావచ్చు.
డేటా ట్రాఫిక్లో అంటే వినియోగంలో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించిందని రిలయన్స్ జియో శనివారం తెలిపింది. తలసరి డేటా వినియోగం నెలకు 30.3 జీబీకి అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ జీబీకి పెరిగిందని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో డేటా ట్రాఫిక్లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియో జూన్ త్రైమాసిక డేటా ప్రకారం.. , డేటా వినియోగం 32.8 శాతం పెరిగి 44 బిలియన్ గిగాబైట్లకు (జిబి) చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 33.2 బిలియన్ జిబి.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే..
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
Read Also:Tolly Wood: చిన్న సినిమా.. పేద విజయం.. ఏమిటా సినిమా..?
13 కోట్ల మంది 5జీ వినియోగదారులు
సంస్థ మొత్తం కస్టమర్ల సంఖ్య సుమారు 49 కోట్లకు చేరుకుంది. ఇందులో 13 కోట్ల మంది 5G వినియోగదారులు ఉన్నారు. దీంతో చైనాను పక్కన పెడితే 5జీ సేవల పరంగా జియో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ నాణ్యమైన, అధిక కవరేజ్, సరసమైన ఇంటర్నెట్ డిజిటల్ ఇండియాకు వెన్నెముక అని, జియో దీనికి సహకరించడం గర్వంగా ఉందని అన్నారు. మా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు 5G, AI రంగంలో ఆవిష్కరణ.. స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు. కస్టమర్ ఫస్ట్ అప్రోచ్తో, జియో తన అత్యుత్తమ నెట్వర్క్, వినూత్న సేవా ఆఫర్లతో తన మార్కెట్ నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ నెట్వర్క్లో వాయిస్ కాలింగ్ రికార్డు స్థాయి 1,420 బిలియన్ నిమిషాలకు చేరుకుంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ.
Read Also:Odisha : తాంత్రికపూజల పేరుతో యువతి తలలోకి 70 సూదులు.. బాబా అరెస్ట్
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే..
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!