Delhi Pollution: ఢిల్లీలో విషపూరితంగా మారిన గాలి.. రెండు రోజుల పాటు స్కూల్స్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజురోజుకూ విషమంగా మారుతోంది. గురువారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాథమిక పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వాయుకాలుష్యం నుంచి కాపాడుకునేందుకు వైద్యులు కూడా ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో కాలుష్యం స్థాయి 350 దాటిందని.. అందుకే గాలిలో కొన్ని రేణువులు కనిపిస్తున్నాయని.. అంతేకాకుండా గాలిలో విషవాయువులు కూడా ఉన్నాయని తెలిపారు.
వాయుకాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావిస్తూ.. “ఈ కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతోంది. ఇది వేగంగా శ్వాసనాళాల రూపంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం ‘క్రానిక్ బ్రాంకైటిస్’కి దారి తీస్తుంది. కేసులు కూడా క్రమక్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి” అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో మెట్రో లేదా ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. క్రానిక్ బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. ఈ సందర్భంలో ప్రజలకు తీవ్రమైన దగ్గు ప్రారంభమవుతుంది.
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
Read Also:World Cup 2023: ఇన్హేలర్లు వాడుతున్న క్రికెట్ ప్లేయర్స్.. కారణం ఏంటంటే?
పెరుగుతున్న కాలుష్యం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
* తెల్లవారుజామున, సూర్యాస్తమయం తర్వాత ఇంటి వెలుపల ఎటువంటి కార్యకలాపాలు చేయవద్దు.
* ఎక్కువ మార్నింగ్ వాక్ చేయకండి.
* ఇంటి కిటికీలు మూసి ఉంచండి.
* చెక్క లేదా కొవ్వొత్తులను కాల్చవద్దు.
* ఇంటిని శుభ్రంగా ఉంచండి. నీటితో శుభ్రం చేసుకోండి.
* మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా N-95 లేదా P-100 మాస్క్ ధరించండి.
ఈ స్థాయిలో వాయుకాలుష్యం, కళ్లలో మంట, కళ్లలో నీళ్లు కారడం, తలనొప్పి, అలసటగా అనిపించడం వల్ల ఆస్తమా మొదలవుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా ఉంటాయని డాక్టర్ చెప్పారు. వీలైనంత తక్కువగా ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. బయటకు వెళ్ళినప్పుడల్లా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. బహిరంగ ప్రదేశాల్లో దేనినీ కాల్చవద్దు. మీ ఇంట్లో మొక్కలు పెంచండి.
Read Also:Friday : మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికి ఉండాలంటే పొద్దున్నే లేవగానే ఈ పని చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!