Delhi Pollution: ఢిల్లీలో విషపూరితంగా మారిన గాలి.. రెండు రోజుల పాటు స్కూల్స్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజురోజుకూ విషమంగా మారుతోంది. గురువారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాథమిక పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వాయుకాలుష్యం నుంచి కాపాడుకునేందుకు వైద్యులు కూడా ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో కాలుష్యం స్థాయి 350 దాటిందని.. అందుకే గాలిలో కొన్ని రేణువులు కనిపిస్తున్నాయని.. అంతేకాకుండా గాలిలో విషవాయువులు కూడా ఉన్నాయని తెలిపారు.
వాయుకాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావిస్తూ.. “ఈ కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతోంది. ఇది వేగంగా శ్వాసనాళాల రూపంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం ‘క్రానిక్ బ్రాంకైటిస్’కి దారి తీస్తుంది. కేసులు కూడా క్రమక్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి” అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో మెట్రో లేదా ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. క్రానిక్ బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. ఈ సందర్భంలో ప్రజలకు తీవ్రమైన దగ్గు ప్రారంభమవుతుంది.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
Read Also:World Cup 2023: ఇన్హేలర్లు వాడుతున్న క్రికెట్ ప్లేయర్స్.. కారణం ఏంటంటే?
పెరుగుతున్న కాలుష్యం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
* తెల్లవారుజామున, సూర్యాస్తమయం తర్వాత ఇంటి వెలుపల ఎటువంటి కార్యకలాపాలు చేయవద్దు.
* ఎక్కువ మార్నింగ్ వాక్ చేయకండి.
* ఇంటి కిటికీలు మూసి ఉంచండి.
* చెక్క లేదా కొవ్వొత్తులను కాల్చవద్దు.
* ఇంటిని శుభ్రంగా ఉంచండి. నీటితో శుభ్రం చేసుకోండి.
* మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా N-95 లేదా P-100 మాస్క్ ధరించండి.
ఈ స్థాయిలో వాయుకాలుష్యం, కళ్లలో మంట, కళ్లలో నీళ్లు కారడం, తలనొప్పి, అలసటగా అనిపించడం వల్ల ఆస్తమా మొదలవుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా ఉంటాయని డాక్టర్ చెప్పారు. వీలైనంత తక్కువగా ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. బయటకు వెళ్ళినప్పుడల్లా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. బహిరంగ ప్రదేశాల్లో దేనినీ కాల్చవద్దు. మీ ఇంట్లో మొక్కలు పెంచండి.
Read Also:Friday : మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికి ఉండాలంటే పొద్దున్నే లేవగానే ఈ పని చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!