Air India: ప్రయాణికులకు ఊరట.. విధుల్లో చేరిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూకుమ్మడి సిక్ లీవ్స్ కారణంగా ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 100కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్న్యూస్ చెప్పింది. సామూహిక సిక్ లీవ్లో ఉన్న ఎయిరిండియా సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల 14వ తేదీ (మంగళవారం) నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
మూకుమ్మడి సిక్ లీవులో ఉన్న సిబ్బంది మే 11వ తేదీన విధుల్లో చేరారని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే కంపెనీ షెడ్యూల్డ్ సాఫ్ట్వేర్లో లోపం కారణంగా స్టాఫ్ సిక్ లీవులో ఉన్నట్టు చూపుతోందని తెలిపింది. ప్రతిరోజూ సుమారు 380 విమాన సర్వీసులను ఎయిరిండియా నడుపుతుండగా.. ఆదివారం సుమారు 20 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్లైన్స్ నిర్వహణా లోపాల కారణంగా సిబ్బంది సమ్మెకు దిగడంతో గత మంగళవారం నుంచి వందలాది విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీంతో సయోధ్య కుదిర్చేందుకు చీఫ్ లేబర్ కమిషనర్ గురువారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. సిబ్బంది సమ్మె విరమణకు అంగీకరించగా, ఎయిర్లైన్స్ సైతం 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంది. ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: మీరు ఆప్కి ఓటేస్తే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?