Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aimim Asaduddin Owaisi On Opposition Meeting Patna Manipur Violence Pm Narendra Modi

Asaduddin Owaisi: నేను నిజం మాట్లాడినందుకే విపక్షాల సమావేశానికి నన్ను పిలవలేదు

Published Date :June 23, 2023 , 7:48 pm
By Rakesh Reddy
Asaduddin Owaisi: నేను నిజం మాట్లాడినందుకే విపక్షాల సమావేశానికి నన్ను పిలవలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం గురించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మేం నిజం మాట్లాడినందుకే మమ్మల్ని ఆహ్వానించలేదన్నారు. శివసేన (UBT) సమావేశానికి హాజరు కావడంపై ఒవైసీ ప్రశ్నలు సంధించారు. శివసేన ఇప్పుడు సెక్యులర్‌గా మారిందా అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పాట్నాలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి పలు ప్రాంతీయ పార్టీల నేతలను కూడా పిలిచారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల సమావేశం గురించి ఒవైసీని ప్రశ్నించగా, దానికి హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందలేదన్నారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ మాట్లాడుతూ.. మేం నిజమే మాట్లాడతాం కాబట్టి సమావేశానికి హాజరుకావాలని పిలవలేదన్నారు. సమావేశానికి హాజరుకావాలని శివసేనకు పిలుపునిచ్చారు, ఇప్పుడు సెక్యులర్ పార్టీనా? ప్రతిపక్షాలు ముందుగా తమ ఎజెండాను క్లియర్ చేసుకోవాలని ఆయన అన్నారు.

Read Also:Megastar: ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన

నితీశ్ ప్రధాని కావాలని కలలు కంటున్నాడు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కూడా అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నితీష్ ఏరియాలో మదర్సాలు తగులబెట్టారని, అయినా ఏమైనా చేశారా? నితీష్ కుమార్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఒవైసీ అన్నారు. గుజరాత్ కాలిపోతున్నప్పుడు ఆయన రైల్వే మంత్రి. ఈ సమావేశానికి దూరంగా ఉంచబడ్డాం ఎందుకంటే అక్కడ మేం నిజాం మాట్లాడతాం కాబట్టని ఒవైసీ అన్నారు.

ముస్లింలను రాజకీయంగా కనిపించకుండా చేశారు
ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని మణిపూర్ సమస్యపై ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని వివక్షపై మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు మణిపూర్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనించాలన్నారు. గత నెలన్నర రోజులుగా మణిపూర్ మండుతోంది. మణిపూర్‌లో 300 చర్చిలను తగలబెట్టారని, ఇది వివక్ష కాదా? పైగా, ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ సెలెక్టివ్ మీడియా యాంకర్లతో ప్రధాని మోడీ మాట్లాడతారని ఒవైసీ అంటున్నారు. ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులందరినీ పిలవాలి. ప్రధాని మోడీ రాజకీయంగా ముస్లింలను పూర్తిగా కనిపించకుండా చేశారని ఆరోపించారు. ఎవరికీ టికెట్ కూడా ఇవ్వలేదు.

Read Also:Chiranjeevi: హిట్ పడడం ఆలస్యం.. మెగాస్టార్ లాగేస్తున్నాడు..?

మణిపూర్ పరిస్థితి బీజేపీ వైఫల్యం
మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలకు పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి ఒవైసీ మాట్లాడుతూ.. గత నెల రోజులుగా మణిపూర్ మండుతున్నదని, ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మణిపూర్‌లో ఏం జరిగినా బీజేపీ వైఫల్యమే. ప్రధాని స్వయంగా మణిపూర్‌కు వెళతారని తాను ఊహించినట్లు తెలిపారు. మణిపూర్‌లో ఏం జరిగినా ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ఎంపీ ఒవైసీ అంటున్నారు. హింసను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రజలను నిర్వాసితులకు గురి చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIMIM
  • Asaduddin Owaisi
  • Manipur Violence
  • Opposition Meet

తాజావార్తలు

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

  • CV Anand : తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..!

  • Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.

  • Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions