Asaduddin Owaisi: నేను నిజం మాట్లాడినందుకే విపక్షాల సమావేశానికి నన్ను పిలవలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం గురించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మేం నిజం మాట్లాడినందుకే మమ్మల్ని ఆహ్వానించలేదన్నారు. శివసేన (UBT) సమావేశానికి హాజరు కావడంపై ఒవైసీ ప్రశ్నలు సంధించారు. శివసేన ఇప్పుడు సెక్యులర్గా మారిందా అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పాట్నాలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి పలు ప్రాంతీయ పార్టీల నేతలను కూడా పిలిచారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల సమావేశం గురించి ఒవైసీని ప్రశ్నించగా, దానికి హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందలేదన్నారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ మాట్లాడుతూ.. మేం నిజమే మాట్లాడతాం కాబట్టి సమావేశానికి హాజరుకావాలని పిలవలేదన్నారు. సమావేశానికి హాజరుకావాలని శివసేనకు పిలుపునిచ్చారు, ఇప్పుడు సెక్యులర్ పార్టీనా? ప్రతిపక్షాలు ముందుగా తమ ఎజెండాను క్లియర్ చేసుకోవాలని ఆయన అన్నారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Read Also:Megastar: ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన
నితీశ్ ప్రధాని కావాలని కలలు కంటున్నాడు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కూడా అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నితీష్ ఏరియాలో మదర్సాలు తగులబెట్టారని, అయినా ఏమైనా చేశారా? నితీష్ కుమార్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఒవైసీ అన్నారు. గుజరాత్ కాలిపోతున్నప్పుడు ఆయన రైల్వే మంత్రి. ఈ సమావేశానికి దూరంగా ఉంచబడ్డాం ఎందుకంటే అక్కడ మేం నిజాం మాట్లాడతాం కాబట్టని ఒవైసీ అన్నారు.
ముస్లింలను రాజకీయంగా కనిపించకుండా చేశారు
ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని మణిపూర్ సమస్యపై ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని వివక్షపై మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు మణిపూర్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనించాలన్నారు. గత నెలన్నర రోజులుగా మణిపూర్ మండుతోంది. మణిపూర్లో 300 చర్చిలను తగలబెట్టారని, ఇది వివక్ష కాదా? పైగా, ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ సెలెక్టివ్ మీడియా యాంకర్లతో ప్రధాని మోడీ మాట్లాడతారని ఒవైసీ అంటున్నారు. ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులందరినీ పిలవాలి. ప్రధాని మోడీ రాజకీయంగా ముస్లింలను పూర్తిగా కనిపించకుండా చేశారని ఆరోపించారు. ఎవరికీ టికెట్ కూడా ఇవ్వలేదు.
Read Also:Chiranjeevi: హిట్ పడడం ఆలస్యం.. మెగాస్టార్ లాగేస్తున్నాడు..?
మణిపూర్ పరిస్థితి బీజేపీ వైఫల్యం
మణిపూర్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలకు పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి ఒవైసీ మాట్లాడుతూ.. గత నెల రోజులుగా మణిపూర్ మండుతున్నదని, ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మణిపూర్లో ఏం జరిగినా బీజేపీ వైఫల్యమే. ప్రధాని స్వయంగా మణిపూర్కు వెళతారని తాను ఊహించినట్లు తెలిపారు. మణిపూర్లో ఏం జరిగినా ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ఎంపీ ఒవైసీ అంటున్నారు. హింసను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రజలను నిర్వాసితులకు గురి చేస్తున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!