Rajastan: రాజస్థాన్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేస్తుంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు ఇవాళ( గురువారం) భేటీ అయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సుఖ్జిందర్ రణధవా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ తో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అశోక్ గెహ్లాట్ వర్చువల్ విధానంలో ఈ సమావేశానికి హాజరైనారు.
Also Read: MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే వరుసగా భేటీ అవుతున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తగిన వ్యూహాలను రచిస్తున్నారు. అయితే.. రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు.. సీఎం ఆశోక్ గెహ్లాట్ కు చాలా కాలం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. బీజేపీ నేత వసుంధర రాజే సింథియా అవినీతిపై చర్యలు తీసుకోవాలని సచిన్ పైలెట్ డిమాండ్ చేశారు. అయితే.. సచిన్ పైలెట్, సీఎం గెహ్లాట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మే నెలలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీరితో చర్చలు జరిపారు. రానున్న శాసన సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కొనేందుకు వీరిద్దరూ అంగీకరించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
Also Read: Botsa Satyanarayana: హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తిస్తాం.. క్వాలిటీ ముఖ్యం
ఇరువురి సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ హై కమాండ్కు వదిలిపెట్టినట్లు వారు తెలిపారు. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. సీఎం పదవి కోసం పైలట్ గట్టిగా ట్రై చేశాడు.. ఇక, 2020లో తిరుగుబాటు చేయడంతో పైలట్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించింది. మరి చూడాలి ఈ ఇద్దరు నేతలు ఎంత మేరకు కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు అనేది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!