Rath Yatra Accident: జగన్నాథ రథయాత్ర చూస్తుండగా భవనం బాల్కనీ కూలి 11 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rath Yatra Accident: గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుని రథయాత్రలో భారీ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని దరియాపూర్ కడియనక ప్రాంతంలోని ఓ భవనంలోని రెండో అంతస్తు బాల్కనీలో ప్రజలు నిలబడి రథయాత్ర చూస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో బాల్కనీలో నిల్చున్న వారితో పాటు కింద నిల్చున్న వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 11 మంది గాయపడినట్లు సమాచారం. వారందరినీ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు.. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు.
బాల్కనీ పడిపోయిన భవనం శిథిలావస్థలో ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రథయాత్రను చూసేందుకు సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఇంటి బాల్కనీకి చేరుకున్నారు. జనం ఒకరితో ఒకరు తోసుకుంటూ బాల్కనీ గోడపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది. బాల్కనీలో కొంత భాగం నేరుగా రెండు అంతస్తుల క్రింద రోడ్డుపై నిలబడిన వారిపై పడింది. శిథిలాలు తలపై పడటంతో కింద నిల్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
Read Also:David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. సెహ్వాగ్ ను అధిగమించి టాప్ 5లోకి ఎంట్రీ
अहमदाबाद में रथ यात्रा के दौरान हादसा
बिल्डिंग की तीसरी मंजिल की बालकनी ढही
हादसे में बताया जा रहा है की 11 लोगों के घायल और 1 की मौत होने की ख़बर है …#Ahmedabad #AhmedabadRathYatra #BREAKING #Breaking_News #Gujrat #RathYatra pic.twitter.com/sjdERZHvcJ— Rishav Singh Dhanraj (@rishav_dhanraj) June 20, 2023
దేశంలో రెండవ అతిపెద్ద రథయాత్ర అహ్మదాబాద్లోని జమాల్పూర్లోని జగన్నాథ ఆలయం నుండి ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి విగ్రహాలను రథంపై ఉంచారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని మంగళ హారతి చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉదయం 7 గంటలకు పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
Read Also:Dimple Hayathi : ఆ భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన డింపుల్ హయతి…?
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!