PM Narendra Modi: ప్రధాని మోడీతో రిషి సునాక్ భేటీ.. కాసేపటికే బ్రిటన్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ యూకే ప్రధాని రిషి సునాక్తో సంభాషించారు. వారిద్దరు కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని అని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో భారత సంతతికి చెందిన తొలి బ్రిటీష్ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది వారి మొదటి సమావేశం. యూకే-ఇండియా యంగ్ ప్రొఫెనల్స్ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు యూకే వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్టు యూకే ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్లో పేర్కొంది. జీ 20 సమ్మిట్లో యూకే, భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read
G20 Summit: ప్రధాని మోదీకి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సెల్యూట్..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల కంటే బ్రిటన్కు భారత్తో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. యూకేలోని అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారతదేశానికి చెందినవారు. యూకేలో భారతీయ సంతతికి చెందిన వారు పెట్టుబడుల వల్ల దాదాపు 95 వేల మంది ఉపాధి లభిస్తోంది. యూకే ప్రస్తుతం భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. ఒకవేళ అంగీకరించినట్లయితే, ఇది భారతదేశం ఒక యూరోపియన్ దేశంతో చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది. వాణిజ్య ఒప్పందం ఇప్పటికే 24 బిలియన్ పౌండ్ల విలువైన యూకే-భారత్ వాణిజ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
- Tags
- Bali
- G20 Summit
- india
- Indonesia
- PM Modi
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?