Seized Ship: నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. ఆ 17 మంది భారతీయ సిబ్బందికి కాస్త ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seized Ship: ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అస్థిరత నెలకొంది. ఈ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతను పెంచింది. అటువంటి పరిస్థితిలో, ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ నౌకలో ఉన్న 17 మంది భారతీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు భారత ప్రభుత్వ ప్రతినిధులతో ఈ భారతీయుల భేటీకి ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
గత శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్లోని ధనవంతుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్ను ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన 17 మంది భారతీయ పౌరుల విడుదల అంశాన్ని లేవనెత్తారు. ఫోన్ సంభాషణ సందర్భంగా, జైశంకర్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న శత్రుత్వానికి సంబంధించి ఉద్రిక్తతను నివారించాలని, సంయమనం పాటించాలని, దౌత్య మార్గానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
Read Also: Devyani Khobrogade: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి
ఈ పరిణామాల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ మాట్లాడుతూ.. ఎంఎస్సీ ఏరీస్ షిప్లో భారతీయులను కలవడానికి టెహ్రాన్ త్వరలో భారత ప్రభుత్వ అధికారులను అనుమతిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఓడ వివరాలను సేకరిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. 17 మంది భారతీయులతో భారత ప్రభుత్వ ప్రతినిధుల సమావేశం గురించి సమాచారం త్వరలో అందించబడుతుంది.
అర్ధరాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి
ఇరాన్ ఏప్రిల్ 13 అర్ధరాత్రి ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించింది. ఇరాన్ ఇజ్రాయెల్పై 300 కంటే ఎక్కువ రకాల డ్రోన్ దాడులను ప్రారంభించింది, ఇందులో కిల్లర్ డ్రోన్లు నుండి బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం వాయు రక్షణ వ్యవస్థను వెంటనే అలర్ట్ చేసింది. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. యారో ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఇజ్రాయెల్ ఈ క్షిపణులను చాలా వరకు కూల్చివేసింది. ఇరాన్ వైమానిక దాడులను 99 శాతం ఇజ్రాయెల్ భగ్నం చేసిందని చెప్పారు. ఈ దాడి తర్వాత అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇజ్రాయెల్కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
ఇజ్రాయెల్పై విచక్షణారహితంగా దాడి చేయడం ద్వారా, ఇజ్రాయెల్ నిరంతర నేరాలకు ఇది శిక్ష అని ఇరాన్ నిర్మొహమాటంగా చెప్పింది. ఈ మేరకు ఇరాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పేరు పెట్టింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ అనే కోడ్నేమ్ను ఇచ్చామని, తద్వారా తాము ఏది చెబితే అది అనుసరిస్తామని తన స్నేహితులు, శత్రువులకు తెలియజేయగలదని ఇరాన్ పేర్కొంది.
ఇరాన్ ఇజ్రాయెల్పై ఎందుకు దాడి చేసింది?
ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై దాడి జరిగింది. ఈ దాడిలో, ఇరాన్ టాప్ కమాండర్తో సహా చాలా మంది సైనిక అధికారులు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!