Aam Admi Party: ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ఆప్ పాన్-ఇండియా పోస్టర్ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Admi Party: ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో ‘మోదీ హటావో, దేశ్ బచావో’ పోస్టర్లను వేసిన కొద్ది రోజుల తర్వాత మరో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఆ ప్రచారాన్ని కొనసాగించనుంది. ఆ పార్టీ గురువారం దేశవ్యాప్తంగా 11 భాషలలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించనుంది. “ఆప్ మార్చి 30న దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో పోస్టర్లను ప్రదర్శిస్తుంది. పార్టీ అన్ని రాష్ట్ర యూనిట్లు తమ తమ రాష్ట్రాల్లో పోస్టర్లు అతికించమని కోరబడ్డాయి. పోస్టర్లు 11 భాషలలో ముద్రించబడ్డాయి,” గోపాల్ రాయ్, ఢిల్లీ ఆప్ చీఫ్, పర్యావరణ మంత్రి చెప్పారు.
“మోదీ హటావో, దేశ్ బచావో” (మోదీని తొలగించండి, భారతదేశాన్ని రక్షించండి) పోస్టర్లు ఢిల్లీ అంతటా గోడలు, విద్యుత్ స్తంభాలపై కనిపించిన కొద్ది రోజులకే తాజా పోస్టర్ యుద్ధం వచ్చింది. దేశ రాజధానిలో ప్రధాని మోదీని తొలగించాలని కోరుతూ వేలాది పోస్టర్లు కనిపించడంతో ఢిల్లీ పోలీసులు 100కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. స్వాతంత్య్రోద్యమ సమయంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదన్నారు. దేశ రాజధాని అంతటా “కేజ్రీవాల్ హఠావో, ఢిల్లీ బచావో” పోస్టర్లను ప్రదర్శించడం ద్వారా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. తన పోస్టర్లపై కేజ్రీవాల్ స్పందిస్తూ, “నాకేమీ సమస్య లేదు. ఎవరైనా పోస్టర్లు వేయవచ్చు. ప్రజలు సంతోషంగా ఉంటే, వారు నన్ను అభినందిస్తారు, లేకపోతే, వారు నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయవచ్చు. ‘మోదీ హటావో, దేశ్ బచావో’ అని రాసి ఉన్న పోస్టర్కు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కోరారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Read Also: Clash: రామాలయం బయట యువకుల మధ్య హింసాత్మక ఘర్షణ.. పోలీసు వాహనాలకు నిప్పు
స్వాతంత్ర్యానికి ముందు కూడా స్వాతంత్ర్య సమరయోధులు పోస్టర్లు అంటించేవారు, బ్రిటిష్ వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేదా చర్యలు తీసుకోలేదని కేజ్రీవాల్ అన్నారు. బ్రిటీష్ పాలనలో భగత్ సింగ్ చాలా పోస్టర్లు అతికించాడు, అతనిపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. దేశ రాజధానిలోని గోడలపై ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఆప్ పోస్టర్లు కనిపించడంతో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సహా ఆరుగురిని అరెస్టు చేసి అనేక కేసులు నమోదు చేశారు. ప్రజా ఆస్తులను పాడు చేసినందుకు అరెస్టులు చేశామని, పోస్టర్లు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ పేరును కలిగి లేవని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!