Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లియిందా.. ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?
Poorna: నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ అభిమానుల మనసులు గెలుచుకున్న నటి పూర్ణ. 2007లో శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సొంత రాష్ట్రం కేరళ. అసలు పేరు షమా ఖాసిమ్. ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం పొందింది. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అంతేకాదు పలు టీవీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది.
Read Also: Happy Birthday Rebel Star Prabhas : ప్రభాస్ కు ఆ డైరెక్టర్ అంటే ఇష్టమట.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వదంతులు వస్తూనే ఉన్నాయి. కాగా ఈ ఏడాది మే31న వ్యాపారవేత్త ఆసీఫ్ అలీతో పూర్ణ ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వాటన్నిటినీ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ముద్దుగుమ్మ తమకు జూన్లోనే పెళ్లైపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ప్రియుడు ఉన్నాడని.. ఆ విషయాన్ని ఇద్దరు దిగిన ఫోటోలతో సహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పూర్ణ. అతడి పేరు ఆసీఫ్ అలీ. ఇతడు అరబ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ బ్రేకప్ అయిందని ప్రచారం కూడా ఈమధ్య బాగా జరిగింది. అయితే ఎన్ని ప్రచారాలు జరిగినా ప్రస్తుతం పూర్ణ , ఆసిఫ్ అలీ దుబాయ్ లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహా , నిచ్చితార్థం ఈ ఏడాది మే నెల 31వ తేదీన జరిగిందని, జూన్ నెల 12వ తేదీన దుబాయ్ లో పెళ్లి అత్యంత సన్నిహితులు సమక్షంలో జరిగిందని తెలిపింది.
Read Also:Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్
దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేకపోయారని , దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఒక నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పిన పూర్ణ ఇది తన చిరకాల కోరిక అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో