Sivaji: శివాజీ ప్రధాన పాత్రలో నవదీప్, రవికృష్ణ, నందు, బిందు మాధవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాని ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళీకాంత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవల ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2025 ఏడాదికి గానూ ఉత్తమ రెండవ చిత్రంగా ‘దండోరా’ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
READ ALSO: CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నందుకు నాన్న క్యారెక్టర్ అంటే నేను చచ్చినా చేసేవాణ్ణి కాదు. నందుకు నాన్న క్యారెక్టర్ అని నాకు ముందు చెప్పలేదు. ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు, వీళ్లందరితో షూటింగ్ అయిపోయిందన్న విషయం నాకు లొకేషన్కి వెళ్లే వరకు తెలియదు. అమ్మతోడు.. ఎవడూ చేస్తాడండి నందుకు తండ్రి అంటే.. ఎంత ఉన్నాడు చూశారు కదా. నవదీప్ అంటే మా సర్పంచ్, అతనితో చేయవచ్చు, నందూ కొడుకు ఏంటి, ఘోరంగా, అరాచకం’ అని సరదాగా అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Realme C83 5G: 7000mAh టైటాన్ బ్యాటరీతో రియల్మీ C83 5G.. బడ్జెట్లో బెస్ట్ లాంగ్ లైఫ్ ఫోన్!