Sivaji: శివాజీ ప్రధాన పాత్రలో నవదీప్, రవికృష్ణ, నందు, బిందు మాధవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాని ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళీకాంత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవల ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2025 ఏడాదికి గానూ ఉత్తమ రెండవ చిత్రంగా ‘దండోరా’ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది.…