Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు. ట్రూడో వ్యాఖ్యలు కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరగడం, తీవ్రవాద అంశాల పట్ల ఆ దేశం మెతక వైఖరికి వ్యతిరేకంగా వచ్చాయి. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ఖలిస్తాన్ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి ప్రశ్నించగా.. ఈ రోజు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంవత్సరాలుగా పోరాడుతున్న రెండు అంశాలపై చర్చించానని చెప్పారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్
Also Read
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
ఖలిస్తానీ నిరసనల గురించి మాట్లాడుతూ.. కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుందని, అవి ఆ దేశానికి చాలా ముఖ్యమైనవని అన్నారు. అయినప్పటికీ హింసను నిరోధించడానికి, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. కొద్ది మంది చేసే చర్యలు మొత్తం సమాజానికి లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలన్నారు. చట్టాన్ని గౌరవించడం ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ చర్చించామన్నారు. బ్రిటీష్ కొలంబియాలోని కెనడాలోని సర్రే పట్టణంలోని శ్రీ మాతా భామేశ్వరి దుర్గా దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీతో అపవిత్రం చేయబడిన కొన్ని రోజుల తర్వాత ట్రూడో ప్రకటన రావడం గమనార్హం.
Also Read: Israel: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జస్టిన్ ట్రూడోతో భేటీపై స్పందించారు. వివిధ రంగాలలో పూర్తి స్థాయి ఇండియా-కెనడా సంబంధాల గురించి చర్చించామని ట్విట్టర్లో పేర్కొన్నారు. జులైలో, భారత ప్రభుత్వం ఢిల్లీలోని కెనడా రాయబారిని పిలిపించి, కెనడాలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక దౌత్య సందేశాన్ని అందజేసింది. ఆ సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడా టెర్రరిజంపై స్థిరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, అలా చేయడంలో తన నిబద్ధతను కొనసాగిస్తుందని చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారులు, దేశంలోని ఉగ్రవాదుల పట్ల తమ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తుందని భావించడం సరికాదని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!