Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు. ట్రూడో వ్యాఖ్యలు కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరగడం, తీవ్రవాద అంశాల పట్ల ఆ దేశం మెతక వైఖరికి వ్యతిరేకంగా వచ్చాయి. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ఖలిస్తాన్ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి ప్రశ్నించగా.. ఈ రోజు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంవత్సరాలుగా పోరాడుతున్న రెండు అంశాలపై చర్చించానని చెప్పారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఖలిస్తానీ నిరసనల గురించి మాట్లాడుతూ.. కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుందని, అవి ఆ దేశానికి చాలా ముఖ్యమైనవని అన్నారు. అయినప్పటికీ హింసను నిరోధించడానికి, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. కొద్ది మంది చేసే చర్యలు మొత్తం సమాజానికి లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలన్నారు. చట్టాన్ని గౌరవించడం ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ చర్చించామన్నారు. బ్రిటీష్ కొలంబియాలోని కెనడాలోని సర్రే పట్టణంలోని శ్రీ మాతా భామేశ్వరి దుర్గా దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీతో అపవిత్రం చేయబడిన కొన్ని రోజుల తర్వాత ట్రూడో ప్రకటన రావడం గమనార్హం.
Also Read: Israel: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జస్టిన్ ట్రూడోతో భేటీపై స్పందించారు. వివిధ రంగాలలో పూర్తి స్థాయి ఇండియా-కెనడా సంబంధాల గురించి చర్చించామని ట్విట్టర్లో పేర్కొన్నారు. జులైలో, భారత ప్రభుత్వం ఢిల్లీలోని కెనడా రాయబారిని పిలిపించి, కెనడాలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక దౌత్య సందేశాన్ని అందజేసింది. ఆ సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడా టెర్రరిజంపై స్థిరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, అలా చేయడంలో తన నిబద్ధతను కొనసాగిస్తుందని చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారులు, దేశంలోని ఉగ్రవాదుల పట్ల తమ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తుందని భావించడం సరికాదని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?