Kalyan Banerjee: వక్ఫ్ బిల్లు సమావేశంలో టీఎంసీ ఎంపీ అత్యుత్సాహం.. సస్పెండ్ చేసిన జేపీసీ ఛైర్మన్
- వక్ఫ్ బిల్లుకు సంబంధించి జేపీసీ సమావేశం
- సమావేశంలో టీఎంసీ ఎంపీ అత్యుత్సాహం
- అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ
- బీజేపీ ఎంపీపై బాటిల్ విసిరిన కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ బిల్లుకు సంబంధించి మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో జరిగిన ఘర్షణ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చర్యలు తీసుకున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ టీఎంసీ ఎంపీని తదుపరి సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. అంటే తదుపరి జేపీసీ సమావేశం ఏది జరిగినా కళ్యాణ్ బెనర్జీని అనుమతి ఉండదు. మంగళవారం జరిగిన జేపీసీ సమావేశంలో కళ్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో కళ్యాణ్ బెనర్జీ గాయపడ్డారు. తీవ్ర వాగ్వివాదం సమయంలో, కళ్యాణ్ బెనర్జీ గ్లాస్ వాటర్ బాటిల్ను పగలగొట్టారు. దాని కారణంగా ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. చేతికి నాలుగు కుట్లు కూడా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
READ MORE: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
ఘర్షణ అనంతరం జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ నేతృత్వంలో రూల్ 374 కింద ఓటింగ్ జరిగింది. ఇందులో కళ్యాణ్ బెనర్జీ సస్పెన్షన్కు అనుకూలంగా 9, వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. జేపీసీ నుండే బెనర్జీని సస్పెండ్ చేయాలని అధికార పక్షం సభ్యులు హితవు పలికారు. అయితే చర్చల అనంతరం ఒకరోజు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
READ MORE:BRICS Summit: పుతిన్తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
జేపీసీ సమావేశంలో ఏం జరిగింది?
ఈ సమావేశానికి పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, మేధావులు హాజరయ్యారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా కళ్యాణ్ బెనర్జీ లేచి మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో కూడా పలుమార్లు సమావేశంలో మాట్లాడారు. కానీ ఈసారి ఆయన ప్రసంగించే సమయంలో అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం లేవనెత్తారు. దీంతో కళ్యాణ్ బెనర్జీ ఆయనపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. ఇంతలో, వారిద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడారు. కోపంతో, కళ్యాణ్ బెనర్జీ ఒక గాజు సీసాని తీసుకొని టేబుల్పై విసిరారు. దాని కారణంగా ఆయన గాయపడ్డారు.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..