Bank strike : మీకేమైనా అర్జెంట్ అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి సరిపడా డబ్బులు తెచ్చుకోండి. ఎందుకంటే బ్యాంకు అధికారులు సమ్మె చేపట్టబోతున్నారు. దీంతో ఈ నెల 19న బ్యాంకులు బంద్ కానున్నాయి. అసలు బ్యాంకు ఉద్యోగులు ఆ ఒక్క రోజు సమ్మె చేపడుతున్నారు. కారణం ఏంటంటే ఇటీవల బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువయ్యాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో నవంబర్ 19వ తేదీన బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి కూడా ఈ శనివారం పని చేయవు. అయితే ప్రైవేటు బ్యాంకులు మాత్రం యధాతధంగా పని చేస్తాయి.
Read Also: Michelle Obama: అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిచెల్ ఒబామా
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారుల సొమ్ముకు విఘాతం కలగడమే కాదు.. ఈ విధానం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై తమ ఆందోళన తెలియజేసేందుకు ఖాతాదారుల పక్షాన ఒక్క రోజు సమ్మెకు దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, ఈ సమ్మెలో కిందస్థాయి ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేపట్టనున్నారని.. ఉన్నతోద్యోగులు కాదని వెంకటాచలం ప్రకటించారు. సమ్మె రోజున క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరెన్స్, ఏటీఎం సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు.
