Fraud: ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు రూ.5 లక్షల టోకరా
- ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 5 లక్షల రూపాయలను ఎంపీడీవో ద్వారా కాజేశారు కేటుగాళ్లు. గత నెల 20వ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎంపీడీవో లక్ష్మప్ప ఫిర్యాదు చేయగా.. ఎంపీడీవో దగ్గర డబ్బులు కాజేసిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను మహబూబ్నగర్ బస్టాండ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 50వేల రూపాయలతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Shocking VIDEO: ఏమరపాటుగా కారు పార్కింగ్.. క్షణాల్లో ఏం జరిగిందంటే..!
Also Read
తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నిందితులు తరుణ్ గౌడ్, ముజాహిద్, నూతేటి జయకృష్ణలు అని పోలీసులు గుర్తించారు.
జయ కృష్ణపై తెలుగు రాష్ట్రాలలో 31 కేసులతోపాటు.. శంషాబాద్, సిద్దిపేటలో ఏసీబీ అధికారులు అని చెప్పి మోసగించినవి మూడు కేసులు నమోదు కాగా.. నిందితుడు జయకృష్ణ పరారీలో ఉన్నాడు. ఎంపీడీవో బండి లక్ష్మప్ప స్వగ్రామం తాండూర్ పట్టణం కావడంతో ఫిర్యాదు తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..