Fraud: ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు రూ.5 లక్షల టోకరా
- ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్ప
Fraud: ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 5 లక్షల రూపాయలను ఎంపీడీవో ద్వారా కాజేశారు కేటుగాళ్లు. గత నెల 20వ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎంపీడీవో లక్ష్మప్ప ఫిర్యాదు చేయగా.. ఎంపీడీవో దగ్గర డబ్బులు కాజేసిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను మహబూబ్నగర్ బస్టాండ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 50వేల రూపాయలతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Shocking VIDEO: ఏమరపాటుగా కారు పార్కింగ్.. క్షణాల్లో ఏం జరిగిందంటే..!
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నిందితులు తరుణ్ గౌడ్, ముజాహిద్, నూతేటి జయకృష్ణలు అని పోలీసులు గుర్తించారు.
జయ కృష్ణపై తెలుగు రాష్ట్రాలలో 31 కేసులతోపాటు.. శంషాబాద్, సిద్దిపేటలో ఏసీబీ అధికారులు అని చెప్పి మోసగించినవి మూడు కేసులు నమోదు కాగా.. నిందితుడు జయకృష్ణ పరారీలో ఉన్నాడు. ఎంపీడీవో బండి లక్ష్మప్ప స్వగ్రామం తాండూర్ పట్టణం కావడంతో ఫిర్యాదు తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో చేశారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!