Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం..ఈడీ ఛార్జీషీట్లో కేజ్రీవాల్ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ రెండో చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ మొత్తం కేసులో విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఛార్జీషీట్ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అవినీతిని అడ్డుకునేందుకు పనిచేయడం లేదని.. ప్రభుత్వాలను కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Read Also: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!
Also Read
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ఇదిలా ఉంటే మరో కీలక విషయాన్ని కూడా ఛార్జీషీటులో ప్రస్తావించింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బును ఆప్ ఉపయోగించినట్లు ఈడీ పేర్కొంది. గోవాలో ఆప్ తరుపున సర్వే చేసిన వాలంటీర్లకు దాదాపుగా రూ. 70 లక్షల నగదును చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఆప్ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్ నాయర్, ప్రచారానికి సంబంధించిన పనిచేసిన వ్యక్తులకు నగదు రూపంలోనే తీసుకోవాలని చెప్పారని ఈడీ ఆరోపించింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్పల్లి, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరాతో కలిసి కుట్రపన్ని నగదు బదిలీకి సహకరించారని ఈడీ తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సోనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. దీంతో ఈ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 17, 2021 నుంచి జూలై, 2022 అమలైన ఈ కొత్త లిక్కర్ స్కాంను సీబీఐ విచారణ అనంతరం ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా పేరు కూడా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది.
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!