Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీ డ్యూటీ పాత్లో రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం భద్రతా సిబ్బంది రిహార్సల్ ఈరోజు నుంచి ప్రారంభించారు. జనవరి 26న భద్రతా సిబ్బంది పూర్తి సన్నద్ధతతో, ఉత్సాహంతో తమ శౌర్యాన్ని ప్రదర్శించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన విద్య, ఆరోగ్య నమూనాకు సంబంధించిన శకటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రిపబ్లిక్ డే రోజున జరిగిన వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
Read Also: AUS vs PAK; లిఫ్ట్లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!
Also Read
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో చండీగఢ్ నుంచి ఏ శకటం రావడం లేదు.. ఇప్పుడు అధికారులు 2025 కవాతు కోసం సన్నాహాలు స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం 20 రాష్ట్రాలకు చెందిన శకటాలు మాత్రమే పరేడ్ లో పాల్గొంటాయి. కానీ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇదో బలమైన ఉదాహరణ అని అన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..